Vinaro Bhagyamu Vishnu Katha: చూడరో విష్ణు కథ లుక్‌

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశీ కథానాయిక. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Updated : 11 Apr 2022 09:11 IST

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశీ కథానాయిక. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్‌  సమర్పకులు. ప్రస్తుతం తిరుపతిలో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా లుక్‌ని విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌తో 80 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: విశ్వాస్‌ డేనియల్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌. ‘

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని