నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
‘ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు’’.. - ఇది నిజమే. కానీ, ‘‘ప్రేమ ఉన్న చోటే భయమూ
‘ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు’’.. - ఇది నిజమే. కానీ, ‘‘ప్రేమ ఉన్న చోటే భయమూ ఉంటుంది’’ అన్న విషయాన్నీ గుర్తు పెట్టుకోవాలి. ప్రేమిస్తున్నామని చెబితే ఎక్కడ కాదంటారేమోనని.. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయంతో ఎన్నో ప్రేమకథలు గుండె లోతుల్లోనే మిగిలి పోతుంటాయి. అందుకే చాలా మంది ప్రేమించిన మనిషి పక్కనే ఉన్నా.. మనసులోని మాట బయట పెట్టలేక లోలోపల ఓ తీయని చిత్రవధ అనుభవిస్తుంటారు. మరి అలాంటి ఓ ప్రేమికుడి మదిలోని భావాలని.. అందమైన ప్రేమ కావ్యంలా మలిస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా ‘‘కోల కళ్లే ఇలా..’’ గీతమవుతుంది.
‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’, ‘అర్జున్ రెడ్డి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాలకు పాటలందించిన రచయిత రాంబాబు గోసాల కలం నుంచి జాలువారిన మరో ప్రేమ గీతమిది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘వరుడు కావలెను’ చిత్రం కోసం రాశారు. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించారు. ఈ గీతం.. మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కోల కళ్లే ఇలా’’ పాట విశేషాల్ని ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా పంచుకున్నారు రాంబాబు.
‘‘ఈ పాట రాసేటప్పుడే నేనెక్కడా ఆంగ్ల పదాలు వాడలేదు. అలతి అలతి తెలుగు పదాలతో కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశా. తొలి పల్లవిని ‘చూపులే నా గుండె అంచుల్లో కుంచెలా నీదే బొమ్మ గీస్తున్నాయే..’ అని వర్ణించా. తర్వాత ‘పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవ్వుతూ నువ్వే నిలుచున్నావే’ అంటూ పల్లవిలో తొలి భాగం పూర్తిచేశా. ఆ వెంటనే ‘కొంచమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే’ అని ఆ ప్రేమికుడి మౌన వేదనని ఓ అందమైన ప్రశ్నలా సంధించా. ‘నిశినలా విసురుతూ శశినువ్వై మెరవగా.. మనసులో పదనిసే ముసుగు తీసెనా’ అని పాటలో ఒక లైన్ ఉంటుంది. ఇది మా చిత్ర బృందం మొత్తానికి బాగా నచ్చింది. దీనర్థం.. ‘నిశిని విసిరేస్తూ.. శశిలాగా మెరిస్తే, నా మనసులో ఒక పదనిస మొదలవుతుంది’ అని ప్రేమికుడి భావన. నాకెంతో సంతృప్తినిచ్చిన అల్లిక ఇది. ఈ గీతంలో అసలైన్ సవాల్ హుక్ లైన్ దగ్గర వచ్చింది. ఈ ట్యూన్ చాలా స్లోగా.. క్లాస్ మెలోడీలా సాగిపోతుంటుంది. అయితే పల్లవి పూర్తయ్యే సరికి పాట మరోస్థాయికి వెళ్తుంది. కాబట్టి అక్కడ అందరి మనసుల్లో నాటుకుపోయేలా మంచి హుక్ లైన్ పడాలి. దీనికోసం మొదలై ‘మెల్ల మెల్లంగానే మనసు నీదై పోయే..’ అని రాశా. కానీ, ఇది మరీ సాదాసీదాగా ఉందనిపించింది. అందులోనూ పాటలో మళ్లీ మళ్లీ వినిపించే లైన్ ఇది. అందుకే దాన్ని కొత్తగా, క్యాచీగా చెప్పాలనే ఉద్దేశంతో ‘కోల కళ్లే ఇలా గుండె గిల్లే ఎలా’ అని మార్చి రాశా. ఇప్పుడీ మార్పే పాటకి మరింత సొగసును తెచ్చి పెట్టింది.
రెండో చరణంలో ‘నువ్వెళ్లే దారులలో చిరుగాలికి పరిమళమే.. అది నన్నే కమ్మేస్తూ ఉందే’ అని రాశా. సినిమాలో శౌర్య ఎప్పుడూ రీతూనే అనుసరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అలా నడిచి వెళ్లిపోతుంటే.. ఆ పరిమళం చిరుగాలిలో కలిసి, ఆ గాలి తనని కమ్మేస్తుందని మనసులకు హత్తుకునేలా వర్ణించా. తర్వాత ‘నా కంటి రెప్పలలో కునుకులకిక కలవరమే.. ఇది నన్నే వేధిస్తూ ఉందే’ అంటూ తన మనసు పడుతున్న తీపి వేదనని అందంగా వివరించా’’.
‘‘ఈ పాటకి నేను రెండు వెర్షన్లు రాశా. రెండు రోజులు పట్టింది. పాట రాస్తున్నప్పుడు ఇది సిద్ శ్రీరామ్తో పాడిస్తారని నాకు అసలు తెలియదు. ఆయన ఎన్నో హిట్ గీతాలు పాడుతున్నారు.. నా పాట పాడితే బాగుండనని అనుకునేవాడిని. ఆ కోరిక ఇన్నాళ్లకు ‘వరుడు కావలెను’తో తీరింది. ఈ గీతాన్ని లక్ష్మీ సౌజన్య ఎంతో చక్కగా తెరకెక్కించారు. తెరపై చూస్తున్నప్పుడు మరింత అద్భుతంగా అనిపిస్తుంది. ఇటీవల ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా వారింట్లో ఆయనకి ఈ పాట పాడి వినిపించా. వెంటనే ఆయన నా భుజం తట్టి చాలా బాగా రాశావని ప్రశంసించారు. ఆ మాట నా పాటకి వంద కోట్ల వ్యూస్ వచ్చినంత ఆనందాన్నిచ్చింది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!