Tollywood: సినీ కార్మికులు మళ్లీ అదేతప్పు చేస్తున్నారు.. సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌

సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు

Published : 22 Jun 2022 01:09 IST

హైదరాబాద్‌: సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నోటిసు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. నిర్మాతలు బుధవారం సజావుగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు.ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నుంచి ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి లేఖ రాలేదని పేర్కొన్నారు.

గతంలో నిర్మాతలకు రూ.2కోట్ల నష్టం..

కార్మికుల వేతనాలపై రేపటి నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ కౌన్సిల్‌ భేటీలో చర్చిస్తామని వివరించారు. ఈ మేరకు రేపు షూటింగ్‌ చేసుకోవచ్చని నిర్మాతలకు సూచించారు. నాలుగేళ్లుగా తమ వేతనాలు పెంచడం లేదంటూ సినీ కార్మికులు.. రేపట్నుంచి షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత నెలలో కార్మిక సంఘాల్లోని స్టంట్‌ యూనియన్‌ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా షూటింగ్‌లకు వెళ్లకపోవడంతో నిర్మాతలకు రూ.2కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న రామకృష్ణ... ఆ ఘటనపై ఫిల్మ్‌ ఫెడరేషన్‌ను వివరణకోరామని తెలిపారు. కానీ, ఫెడరేషన్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. ఇప్పుడు కార్మికులు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని