kondapolam: పవన్‌ అనుమతించకుంటే ‘కొండపొలం’ లేదు

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి...

Updated : 04 Oct 2021 06:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రం ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతమందించారు. ఈ నెల 8న థియేటర్లలో విడుదలవనుంది. ఈ సందర్భంగా ‘కొండపొలం’ ఆడియో వేడుక కర్నూలులో శనివారం ఘనంగా జరిగింది. 

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ..‘హరిహరవీరమల్లు సినిమా మధ్యలో కొండపొలం సినిమా మొదలైంది. ఈ సినిమా చేయడానికి అనుమతినిచ్చినందుకు పవన్‌కల్యాణ్‌కు ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. సుకుమార్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాను నాకు పరిచయం చేయకపోయినా, సన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి ఈ నవలను రాయకపోయినా ‘కొండపొలం’ మొదలయ్యేది కాదు. సినిమా మేం చేసిందంతా ఒక ఎత్తైతే, దీన్ని మరోమెట్టు ఎక్కించిన వ్యక్తి ఎమ్ఎమ్ కీరవాణి. ఈ సినిమాకోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు.
హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ..‘నా రెండో సినిమాకే కీరవాణి సంగీతమందించడం నా అదృష్టం. ‘ఆర్‌ఆర్‌ఆర్’‌, ‘హరిహర వీరమల్లు’ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమా కథ నచ్చి చేశారు. డైరెక్టర్‌ క్రిష్‌ ఎప్పటికీ తలెత్తుకుని ఉండాలని చెప్పేవారు. మీరు కూడా మీ ఇంట్లో వాళ్లని, దేశాన్ని తలెత్తుకునేలా చేయాలి’అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు కీరవాణి, సినీ నటులు రఘు, సాయిచంద్‌, అంటోని, నటి హేమ, తదితరులు హాజరయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని