Oscar 2022: ‘కూళాంగల్’ సింపుల్గా తీస్తే.. ఆస్కార్ పోటీకి వెళ్లింది!
ఆస్కార్.. యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్స్. ఈ అవార్డుని స్వీకరించాలని సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కలలు కంటారు. ఈసారి మన భారతదేశం తరఫున ఆస్కార్-2022 పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్’ ఎంపికైన సంగతి తెలిసిందే.
‘కూళాంగల్’ దర్శకుడు పీఎస్ వినోద్రాజ్
ఇంటర్నెట్ డెస్క్: ఆస్కార్.. యావత్ సినీ ప్రపంచం ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు. ఈ అవార్డుని స్వీకరించాలని సినీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కలలు కంటారు. ఈసారి మన భారతదేశం తరఫున ఆస్కార్-2022 పోటీలో నిలవడానికి తమిళ చిత్రం ‘కూళాంగల్’ ఎంపికైన సంగతి తెలిసిందే. హిందీలో విడుదలైన ‘సర్దార్ ఉద్దామ్’, ‘షేర్నీ’ చిత్రాలను వెనక్కి నెట్టి ‘కూళాంగల్’ దేశం తరఫున ఆస్కార్కు ఇండియా నుంచి అధికారికంగా ఎంట్రీ సాధించింది. ఇక ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పీఎస్ వినోద్రాజ్కు.. దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం మరో విశేషం. తొలి అడుగుతోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై వినోద్రాజ్ ఓ జాతీయ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో.. పలు విషయాలు చెప్పుకొచ్చారు.
అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది..
‘‘చాలా భావోద్వేగానికి గురవుతున్నా. మూడేళ్ల ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. ‘కూళాంగల్’ సినిమా ఈ స్థాయిలో గుర్తింపు పొందుతుందని, అంతర్జాతీయ, జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శిస్తారని మేము ఏనాడూ ఊహించలేదు. నిజాయతీగా, సింపుల్గా దీన్ని చిత్రీకరించాం. నాతో పాటు మా టీమ్ అంతా ఉత్సాహంగా ఉన్నాం. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. తుది జాబితాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం’’
అలా సినిమాలపై ప్రేమ పుట్టింది
‘‘తమిళనాడులోని మధురై జిల్లా మేలూరు పట్టణం మాది. సినిమాలపై నాకు ప్రేమ పుట్టడానికి ఓ కారణం.. మేలూరులో ఎన్నో చిత్రాల షూటింగ్లు జరిగేవి. ఆ సినిమా సెట్స్ని చూడటం మొదలుపెట్టాక నాకు సినిమాలపై ఆసక్తి కలిగింది. అప్పుడే ఎలాగైనా సినిమాటోగ్రాఫర్ అవ్వాలని నిశ్చయించుకున్నా. దర్శకులు మాజిద్ మాజిది, స్టాన్లీ కుబ్రిక్ తెరకెక్కించిన చిత్రాలు చూశాక.. స్వచ్ఛమైన సినిమా అంటే ఏమిటో నాకు అర్థమైంది. అందుకే వారి సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను’’
డీవీడీ షాపులో పనిచేశా
‘‘కష్టాల కారణంగా.. చిన్న వయసు నుంచే పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. రకరకాల పనులు చేస్తూ జీవితం నెట్టుకొచ్చా. చెన్నైలోని ఓ డీవీడీ షాపులో సేల్స్ బాయ్గా పనిచేశా. అదే నన్ను సినిమా ప్రపంచానికి దగ్గర చేసింది. డీవీడీ షాపులో పనిచేసేటప్పుడు సినీ పరిశ్రమకు చెందిన కొందరితోనైనా పరిచయాలు ఏర్పడతాయని భావించా. అలా తమిళ దర్శకుడు సర్గుణం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు పనిచేశా. ఆ తరువాత ‘కూళాంగల్’ స్క్రిప్ట్ రాయడం ప్రారంభించా’’
ఓ పక్క వేడిసెగలు.. మండుటెండ.. అయినాసరే!
‘‘2019 మే.. మండుటెండల్లో మేలూర్లోని అరితపట్టి అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్ చేశాం. ఈ కథకు లొకేషన్స్, వేసవిలో చిత్రీకరించడమే కీలకంగా నిలిచాయి. ఇందులో కీలకమైనవి కొడుకు, తండ్రి, ప్రకృతి. ఆ గ్రామంలో నీటికి లోటుండదు. వ్యవసాయం చేస్తూ ప్రశాంత జీవనాన్ని సాగిస్తున్న ఆ కుటుంబంలో కరవు వల్ల ఒక్కసారిగా మార్పులు వస్తాయి. ఓ వైపు కరవు, మరోవైపు ఆ కుటుంబం ఎదుర్కొన్న సంఘటనలు ఈ చిత్రంలో ప్రధానంగా చూపించాలనుకున్నాం. కరవు ఉన్న ప్రాంతాల్లోనే షూట్ చేశాం. తీవ్రమైన ఎండకారణంగా కెమెరా లెన్స్ సరిగా పనిచేసేవి కావు. కొన్నిసార్లు చెప్పులు లేకుండా షూట్ చేయాల్సి వచ్చేది’’
చివరికి నయనతార, విఘ్నేశ్ శివన్కి కథ నచ్చడంతో...
‘‘కరోనా/లాక్డౌన్ కన్నా ముందే దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ‘తాంగా మీంగల్’ చిత్రానికి గానూ జాతీయ అవార్డు దక్కించుకున్న దర్శకుడు రామ్ని కలిసి మా చిత్రం గురించి చెప్పాం. ఆయనికి మా పనితీరు, సినిమా తెరక్కెకించిన విధానం నచ్చింది. హీరోయిన్ నయనతార, నిర్మాత విఘ్నేష్ శివన్ కూడా మా చిత్రాన్ని చూశారు. అనంతరం వారే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు’’ అని దర్శకుడు వినోద్రాజ్ చెప్పారు.
వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే..
ఈ చిత్రాన్ని తన వ్యక్తిగత అనుభవం నుంచే తీసినట్లు దర్శకుడు వినోద్రాజ్ చెప్పారు. గతంలో తన సోదరి, ఆమె భర్త మధ్య గొడవ జరగడంతో ఆమె ఇంటి నుంచి బయలుదేరి తల్లిగారింటికి చేరుతుంది. దీంతో భార్యను వెతుక్కుంటూ భర్త ఆమె ఇంటికి చేరుకుంటాడు. దీని ఆధారంగానే కథను తీర్చిదిద్దినట్లు దర్శకుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్