Cinema news: బాలకృష్ణతో కొరటాల మల్టీస్టారర్‌.. మరో హీరో ఎవరు?

కమర్షియల్‌ కథకు, సందేశం జోడించి సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివ సిద్ధహస్తులు. ప్రస్తుతం చిరంజీవి

Published : 19 Nov 2021 01:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమర్షియల్‌ కథకు, సందేశం జోడించి సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివ సిద్ధహస్తులు. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడు ‘ఆచార్య’కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. రామ్‌చరణ్‌ ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారు. గతంలోనూ ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో ‘జనతా గ్యారేజ్‌’ను కొరటాల తెరకెక్కించారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. బాలకృష్ణ కోసం కొరటాల ఒక పవర్‌ఫుల్‌ కథ సిద్ధం చేశారట. ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉండటంతో మరో హీరో ఎవరా? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం మహేశ్‌బాబు పేరు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కొరటాల ఇప్పటికే ఆయనతో రెండు సినిమాలు చేశారు. దీంతో మహేశ్ ఓకే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆయన కాదంటే, మెగా క్యాంపు నుంచి కథానాయకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. పైగా ప్రస్తుతం ఉన్న అటు కొరటాలకు, అటు బాలయ్యకు ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని, ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. మరోవైపు  కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసి, ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని