AP News: సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌

సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ అసలు గుర్తుందా? అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి(Prasanna Kumar Reddy) అన్నారు.

Updated : 10 Jan 2022 14:35 IST

నెల్లూరు: సినిమా వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ అసలు గుర్తుందా? అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి(Prasanna Kumar Reddy) అన్నారు. ఏపీకి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని హీరోలు, దర్శకులు, నిర్మాతలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఎంతసేపటికీ హైదరాబాద్‌లో ఉంటూ తెలంగాణలో సినిమాలు తీసుకుంటూ ఏపీ గురించి ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రసన్నకుమార్‌ మాట్లాడారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. సామాన్యుడు కూడా పెద్ద సినిమాలు చూడాలనే వైకాపా ప్రభుత్వం ధర తగ్గింపు నిర్ణయం తీసుకుందని ప్రసన్నకుమార్‌ చెప్పారు. సినిమా వాళ్లకు తెదేపా అధినేత చంద్రబాబు మద్దతు ఉందని ఆయన ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు