Krishna Vamsi: ఆ సినిమా ఫ్లాప్‌.. సీక్వెల్‌ ఎలా చేస్తా: కృష్ణవంశీ

మూఢ నమ్మకాల నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డేంజర్‌’. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన ఈసినిమా సీక్వెల్‌పై తాజాగా ఆయన స్పందించారు.

Published : 31 Oct 2022 20:28 IST

హైదరాబాద్‌: ‘డేంజర్‌’ (Danger) వంటి క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో ఒకానొక పరాజయాన్ని అందుకున్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). నరేశ్‌, స్వాతి, సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ అందుకోలేకపోయింది. ‘డేంజర్‌’ విడుదలై సుమారు 17 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌పై కృష్ణ వంశీ స్పందించారు.

‘డేంజర్‌’కు స్వీకెల్‌ తెరకెక్కించవచ్చు కదా..! అంటూ ఓ నెటిజన్ ట్వీట్‌ చేయగా.. ‘‘ఈ సినిమా ఫ్లాప్‌ సర్‌. నా ఉద్దేశం ప్రకారం ప్రేక్షకులు దాన్ని అంగీకరించలేదు. అలాంటప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపు ఎలా చేయగలను’’ అని కృష్ణవంశీ సమాధానమిచ్చారు. మరో నెటిజన్‌.. ‘మీ ఉద్దేశంలో ఫ్లాప్‌ అంటే ఏమిటో నాకు తెలియదు. కానీ, ఆ సినిమా మా మనుసు దోచుకుంది’ అని ట్వీట్‌ చేశాడు. ‘‘సినిమాపై పెట్టిన డబ్బును కూడా నిర్మాత తిరిగి పొందలేకపోతే దాన్నే ఫ్లాప్‌ అంటారు. డబ్బే రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఇలాంటి సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత కూడా ముందుకురాడు’’ అని ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ ..తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని