krishnam raju: సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోవాలనుకున్న కృష్ణంరాజు..!
కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు కృష్ణంరాజు (krishnam raju).
హైదరాబాద్: కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు కృష్ణంరాజు (krishnam raju). అంతేకాదు.. నిర్మాతగానూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1966లో ‘చిలకా గోరింక’తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయనకు తొలి చిత్రమే నిరాశకు గురి చేసింది. దీంతో దిగులు పడిపోయిన కృష్ణంరాజు సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోవాలనుకున్నారు. కానీ, విధి ఎవరిని ఎటు వైపు తీసుకెళ్తుందో తెలియదు కదా! అదే సమయంలో ఒక రోజు అనుకోకుండా సినీ దిగ్గజం ఎల్వీ ప్రసాద్ను కృష్ణంరాజు కలిశారు. ఆయన చెప్పిన మాటల వల్లే సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోదామనుకున్న కృష్ణంరాజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. ఇదే విషయాన్ని కృష్ణంరాజు ఓ సందర్భంలో పంచుకున్నారు.
‘‘చిత్ర పరిశ్రమలో నేను నిలదొక్కుకోవడానికి కారణం ఎల్వీ ప్రసాద్. ఆయనతో నాకు అనుబంధం లేకపోయుంటే సినీ పరిశ్రమని వదిలి వెళ్లిపోయేవాణ్ని. అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘నేనంటే నేనే’లో అవకాశం వచ్చినా... వ్యతిరేక ఛాయలతో కూడుకున్న పాత్ర కదా అని వద్దనుకున్నా. అదే సమయంలోనే ఎల్వీ ప్రసాద్ని కలవగా... పాత్ర ఎలాంటిదైనా నువ్వు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యావన్నదే ముఖ్యమని హిత బోధ చేశారు. ఆయన మాటలు విని ఆ సినిమా చేశా. అది విజయవంతం కావడంతో పాటు ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం వచ్చింది’’ అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
వివిధ సందర్భాల్లో కృష్ణంరాజు పంచుకున్న మాటలివి
* ‘‘పుట్టినరోజు అనగానే నాకు నా అభిమానులే గుర్తుకొస్తారు. ‘అమరదీపం’ నుంచి పరిశ్రమలో నా జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దండలు, పుష్ప గుచ్ఛాలతో వచ్చే అభిమానులను ఆ డబ్బుని సమాజ సేవకి ఉపయోగించాలని చెప్పేవాణ్ని. వాళ్లూ అదే పాటిస్తున్నారు. ఇతర కథానాయకుల అభిమానులతోనూ సఖ్యతగా మెలిగేవాళ్లు. దాంతో నాకు విలువ పెరిగింది’’
* ‘‘సుదీర్ఘమైన నా సినీ ప్రయాణంలో పరాజయాలు తక్కువే కానీ.. కెరీర్ పరంగా చాలా ఒడుదొడుకుల్ని చూశా. నటన పరంగా, నిర్మాణం పరంగానూ కొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతూ సినిమాలు చేశా. పౌరాణిక నేపథ్య కథలు పెద్దవాళ్లు, మహిళలకి మాత్రమే పరిమితం అనుకొంటున్న పరిస్థితుల్లో ‘భక్తకన్నప్ప’ చేశా. హిందీలో మాత్రమే ఇలాంటి సినిమాలు సాధ్యం అనుకొంటున్న పరిస్థితుల్లో ‘తాండ్ర పాపారాయుడు’ చేశా. రోజూ 5 వేల మందితో, ఏనుగులు, గుర్రాలతో చిత్రీకరణ చేశాం. ట్రెండ్ మారాలని, చిత్ర పరిశ్రమకి మన తోడ్పాటు కూడా ఉండాలనే గోపీకృష్ణ మూవీస్ సంస్థని ప్రారంభించాం’’
* ‘‘పౌరాణికాలు మొదలుకొని అన్ని రకాల కథల్లోనూ నటించా. కలల పాత్రలంటూ ఏమీ లేవు. కానీ కొత్తగా, ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని పాత్రలేవైనా వస్తే చేయాలనే తపన ఇప్పుడూ ఉంది. ‘కటకటాల రుద్రయ్య’తో పాటు అప్పట్లో నేను చేసిన పాత్రలే నాకు రెబల్స్టార్ అనే పేరును తీసుకొచ్చాయి. నటుడిగా ప్రేక్షకుల్లో నాపై ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని, దీటైన పాత్రలొచ్చినప్పుడే సినిమాలు చేస్తున్నా’’
* ‘‘కేంద్రమంత్రిగా నేను బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి విభాగంలోనూ కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించా. ఎంపీగా నా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా. 400 ఊళ్లు ఉంటే అన్నిచోట్లా నా ముద్ర కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత డబ్బు ఇస్తే కానీ ఓట్లు వేయని పరిస్థితులొచ్చాయి. ప్రభుత్వాలు కూడా ప్రజల్ని సోమరిపోతులుగా మార్చకుండా, వాళ్ల ఉపాధికి పనికొచ్చేలాగా అభివృద్ధి పనులు చేయాలి. రైతాంగానికి, అవసరమైన వాళ్లకి మాత్రమే రాయితీలు ఇవ్వాలి’’
‘‘రాజకీయాల్లోనూ అరుదైన ప్రయాణం నాది. దేశంలో కేంద్రమంత్రి అయిన తొలి కథా నాయకుణ్ని నేనే. అమితాబ్ బచ్చన్ని కలిసినప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ... ‘మీరు నాకు బాగా తెలుసు, ‘కౌన్ బనేగా కరోడ్పతి’ కార్యక్రమంలో కేంద్రమంత్రి అయిన తొలి కథానాయకుడు ఎవరనే ప్రశ్న అడిగాన’ని చెప్పారు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్గుడ్ స్టోరీ.. పవన్ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్దత్ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్