బెల్లంకొండ గణేష్‌ సరసన బేబమ్మ ?

ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుల్లో సాయి శ్రీనివాస్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయన మరో కుమారుడు గణేష్‌ కూడా కథానాయకుడిగా పవన్‌ సాదినేని

Published : 17 May 2021 20:17 IST

ఇంటర్నెట్ డెస్క్:  ప్రముఖ తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుల్లో సాయి శ్రీనివాస్‌ హీరోగా రాణిస్తున్నారు. ఆయన మరో కుమారుడు గణేష్‌ కూడా కథానాయకుడిగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌, అమృతరావు జంటగా నటించిన ‘వివాహ్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌ హక్కులను బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారు. అయితే ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్ హీరోగా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టి కథానాయికగా నటిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి వార్త బయటకు రాలేదు.

సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన ‘వివాహ్‌’ (2006) చిత్రం అప్పట్లో తెలుగులోనూ ‘పరిణయం’ పేరుతో అనువాదమైంది. బెల్లంకొండ కుటుంబం ఈ మధ్య కాలంలో ఇతర భాషల సినిమాలకు సంబంధించిన రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో హిట్టయిన సినిమాలను హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నారు. ఇక కన్నడ భామ కృతి శెట్టి తొలి చిత్రం ‘ఉప్పెన’లో తన నటనతో ఆకట్టుకొని వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి నానితో కలిసి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో  నటిస్తోంది. మరో హీరో సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని