నా నటన చూసి ఏడ్చేశారు: కృతి శెట్టి
ఫిబ్రవరి 12న ‘ఉప్పెన’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా, వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంది కృతి శెట్టి...
నటన అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ దాన్నే కెరీర్గా భావించలేదు అంటోంది యువ కథానాయిక కృతి శెట్టి. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈ భామ ‘ఉప్పెన’తో కథానాయికగా మారింది. వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా, వ్యక్తిగత వివరాలను మీడియాతో పంచుకుంది కృతి శెట్టి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.
ఆ పేరు నాది కాదు...
నా వ్యక్తిగత సమాచారం కోసం చాలామంది గూగుల్లో వెతుకుతున్నారని తెలిసింది. వికీపీడియాలో కనిపించే అద్వైత అనే పేరు నాది కాదు. కృతి శెట్టి అనే మరో అమ్మాయి ఉంది. తను అలా పేరు మార్చుకుంది. ఆ ప్రొఫైల్ నాది కాదు. నటన అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ దాన్నే కెరీర్గా ఎంచుకుంటా అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఉండేది. అయితే నటన పట్ల ఉన్న ఇష్టాన్ని పక్కనపెట్టకుండా అప్పుడప్పుడు వాణిజ్య ప్రకటనల్లో నటించాను. వీటి వల్లే ఇప్పుడు సినిమా అవకాశం వచ్చింది. అయితే చదువు కారణంగా ముందు నటన వద్దనుకున్నాను. కానీ ఈ కథ నా మనసుని హత్తుకోవడంతో తప్పకుండా చేయాలనిపించింది.
అది యాదృచ్ఛికమే..
నాలానే వైష్ణవ్ తేజ్కీ సినిమాలు చూడటం ఇష్టం లేదనే సంగతి ఈ మధ్యే తెలిసింది. అలాంటి మా ఇద్దరికీ ఇది తొలి సినిమా కావడం యాదృచ్ఛికమే. అలా అని చెప్పి, ఏదో నటించేద్దాం అనుకోకుండా పాత్రకు తగినట్టు నన్ను నేను మార్చుకున్నాను. బేబమ్మ (నాయిక పాత్ర పేరు) నేనే అనుకుని నటించాను. నా వ్యక్తిగత జీవితానికి కొంచెం దగ్గరగా ఉంటుందీ పాత్ర. అందుకే సహజంగా, సులభంగా చేయగలిగాను. దర్శకుడు నాతో తెలుగులో మాత్రమే మాట్లాడేవారు. ఆ సమయంలో ఆయన్ని బాగా పరిశీలించేదాన్ని. నేను తెలుగు నేర్చుకునేందుకు వైష్ణవ్, సహాయక దర్శకులు, సెట్లో ప్రతి ఒక్కరూ సహకరించారు. అందుకే ఇంత త్వరగా వచ్చేసింది. సినిమా చిత్రీకరణకు ముందు ఐదు రోజుల వర్క్ షాప్లో పాల్గొన్నాను.
ఎప్పటికీ మరిచిపోలేను..
సినిమాలో ఓ ఎమోషనల్ సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక మోనిటర్లో ఔట్పుట్ చెక్ చేస్తుంటే ఛాయాగ్రాహకుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో నటిగా చాలా గర్వంగా అనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవిగారు నా నటనను మెచ్చుకోవడం మరో గొప్ప అనుభూతి. ఈ సినిమాకు సంతకం చేయకముందు నాకు ఏ దర్శకులు, హీరోలూ తెలియదు. చిరంజీవిగారు మాత్రమే తెలుసు. సుకుమార్ గారిని కలిసినపుడు కొంత ధైర్యం వచ్చింది. నేను టీవీలో వచ్చే సినిమాలు చూడటం తప్ప, బయటకెళ్లి చూసింది లేదు.
ఇద్దరూ చాలా సింపుల్..
విజయ్ సేతుపతి, వైష్ణవ్ ఇద్దరూ చాలా సింపుల్గా ఉంటారు. సెట్లో ఇద్దరితో చాలా సౌకర్యవంతంగా ఉండేదాన్ని. సినిమాలో నాకు, సేతుపతి గారి మధ్య పెద్ద సన్నివేశం ఉంది. ఆయనతో ఎలా నటించాలో అనే భయం మొదట్లో ఉండేది. నా పరిస్థితిని గమనించిన ఆయన.. ఎలా నటిస్తే బాగుంటుందో చెప్పి, ఆ సీన్ బాగా వచ్చేలా సాయం చేశారు.
సూటిగా...
* మా స్వస్థలం బెంగళూరు. అయితే పెరిగిందంతా ముంబయిలోనే.
* నాన్న వ్యాపారవేత్త, అమ్మ ఫ్యాషన్ డిజైనర్.
* మెథడ్ యాక్టింగ్ అంటే ఇష్టం.
* శ్రీదేవి, సమంత.. నటనలో వీళ్లే నా స్ఫూర్తి.
* చికెన్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్ చేయడం హాబీ.
కృతి 11 ఏళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలో నటించింది. ఓసారి యాడ్ ఫిల్మ్ కోసం హైదరాబాద్ వచ్చినపుడు దర్శకుడు బుచ్చిబాబు కలిశారు. ఆయన చెప్పిన కథ ఆకట్టుకుంది. పైగా మెగా కుటుంబం నుంచి వస్తున్న కథానాయకుడు కావడం మరో అడ్వాంటేజ్ అనిపించింది. ఇంతకన్నా ఇంకేం కావాలి ..నాయికగా పరిచయం అయ్యేందుకు అనుకొని కృతి శెట్టి ఒప్పుకుంది. ఇంత బాగా నటిస్తుందని నేనూ అనుకోలేదు. కృతిని తెరపై చూసినపుడు చాలా సంతోషం కలిగింది. చిత్రీకరణ సమయంలో నేను కృతితోనే ఉన్నాను. తన కోసం నా జాబ్ని వదిలేశాను. తన నటనతో మా కష్టాన్నంతా మర్చిపోయేలా చేసింది. ప్రస్తుతం సైకాలజీ చదువుతోంది. చదువులోనూ చురుకుగా ఉంటుంది.
- నీతూ శెట్టి, కృతి శెట్టి తల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు