Krithi shetty: శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలి
‘‘ఒకప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ, ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం హైదరాబాద్ రావడం.. తొలి సినిమా ‘ఉప్పెన’లో అవకాశం దొరకడం నా కెరీర్ను మలుపు తిప్పింది. కెరీర్ ఆరంభంలోనే వరుసగా మంచి పాత్రలు దక్కుతుండటం అదృష్టంగా భావిస్తున్నా.
ముఖాముఖీ ముచ్చట
‘‘ఒకప్పుడు నేను డాక్టర్ కావాలనుకున్నా. కానీ, ఓ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం హైదరాబాద్ రావడం.. తొలి సినిమా ‘ఉప్పెన’లో అవకాశం దొరకడం నా కెరీర్ను మలుపు తిప్పింది. కెరీర్ ఆరంభంలోనే వరుసగా మంచి పాత్రలు దక్కుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. మరింత కష్టపడి.. మరిన్ని మంచి పాత్రలు, సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అంది నటి కృతి శెట్టి. ఈ ఏడాది ఇప్పటికే ‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో సందడి చేసిన కృతి.. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుధీర్బాబు హీరోగా నటించిన చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది కృతిశెట్టి.
‘‘ఈ విజయం నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో నేను నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర చేశా. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేసి ‘నన్ను నేను స్క్రీన్పై చూసుకున్నట్లుంది’ అని చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఓ నటిగా ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది. సినిమా చూసి మా అమ్మ చాలా ఎమోషనల్ అయ్యింది. నాన్నకి కూడా చాలా నచ్చింది. నేనీ చిత్రం చేయడం వారికి చాలా గర్వంగా అనిపించింది. ఇంత మంచి పాత్రని నాకిచ్చినందుకు దర్శకుడు ఇంద్రగంటికి కృతజ్ఞతలు’’.
నా జీవితంలో జరిగిందనుకుంటా!
‘‘నేను వైవిధ్యభరితమైన పాత్రలు పోషించగలిగినప్పుడే ప్రేక్షకులు నటిగా నాలోని ప్రతిభను గుర్తించగలుగుతారు. అప్పుడే నన్ను నమ్మి.. నా పాత్రలతో ప్రేమలో పడతారని విశ్వసిస్తా. నేనిప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఇలా వేటికవే విభిన్నంగా ఉన్నవే. కెరీర్ ఆరంభంలోనే ఇలా భిన్న కోణాలున్న పాత్రలు పోషించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఏ సినిమా చేసినా.. అందులోని నా పాత్ర గురించి ముందే ఓ నోట్స్ సిద్ధం చేసి పెట్టుకుంటాను. దాని వల్ల ఆ పాత్రని అభినయించడం నాకు చాలా సులువుగా అనిపిస్తుంది. అలాగే సెట్లో ఓ సీన్ చేస్తున్నప్పుడు నిజంగానే అది నా జీవితంలో జరుగుతోందనుకొని చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా సహజమైన హవభావాలు పలుకుతాయని నమ్ముతాను’’.
సినిమాల కోసం సైకాలజీ చదువుతున్నా
‘‘ఓవైపు కమర్షియల్ నాయికగా అలరిస్తూనే.. మరోవైపు నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనూ సత్తా చాటాలనుంది. ఈ విషయంలో నాకు నటి శ్రీదేవి స్ఫూర్తి. ఆమె కమర్షియల్ హీరోయిన్ పాత్రలకు ఎంత బాగా సెట్ అయ్యేవారో.. బలమైన నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ అంతే చక్కగా ఒదిగిపోయేవారు. ఏ పాత్ర ఇచ్చినా ‘తగ్గేదే లే’ అన్నట్లు చేసేవారు. నాకూ ఆమెలా పేరు తెచ్చుకోవాలనుంది. సాధ్యమైనంత వరకు నేను నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను. సద్విమర్శల్ని మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ప్రస్తుతం నేను సైకాలజీ చదువుతున్నా. సినిమాలో పాత్రల్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది తెలుస్తుందని.. నటనలో నాకు హెల్ప్ అవుతుందని ఈ కోర్స్ చేస్తున్నా (నవ్వుతూ)’’.
* ‘‘నేను ప్రస్తుతం నాగచైతన్యతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. అలాగే సూర్యతో ఓ చిత్రం చేస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్లు లైనప్లో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలుస్తాయి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు