భయపెట్టే సినిమాలంటే ఇష్టపడను: కృతి
కృతి సనన్, వరుణ్ధావన్ కలిసి జంటగా నటిస్తున్న బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రం ‘భేడియా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్లో పూర్తి చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కృతిసనన్, వరుణ్ధావన్ కలిసి జంటగా నటిస్తున్న బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రం ‘భేడియా’. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్లో పూర్తి చేసుకుంది. చిత్రం గురించి కృతి మాట్లాడుతూ..‘‘నాకు వ్యక్తిగతంగా హర్రర్, భయానకంగా ఉండే చిత్రాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అయితే ‘భేడియా’లో హాస్యం చాలా ఎక్కువగా ఉంటుంది. షూటింగ్లో ఎంజాయ్ చేశాను. రక్తపిశాచి, తోడేలు ప్రపంచాన్ని ఇందులో చూసి సంబరపడ్డా. ఈ చిత్ర కథలో చమత్కార పాత్రలలో పాటు వినోదం కూడా ఉంటుంది. దర్శకుడు అమర్ కౌశిక్ ఇలాంటి సినిమాలు తీయడంలో ఇప్పటి తరంలో బాగా పట్టున్న దర్శకుడు. ఆయన తీసిన ‘స్త్రీ’ చూశాను. చాలా బాగా తెరెక్కించారు. హర్రర్, హాస్యాన్ని కలిపి చూపించే విధానంలో ఆయనకు చాలా ప్రతిభ ఉంది. ఆ విధానమే నాకు చాలా బాగా నచ్చిందని’’ తెలిపింది. మడోక్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజ్జన్ నిర్మాత. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం కృతి ససన్ - ప్రభాస్తో కలిసి ‘ఆదిపురుష్’లో నటించనుంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది. ఇక అక్షయ్ కుమార్తో కలిసి ‘బచ్చన్ పాండే’ సినిమాలో ‘మైరా’ అనే పాత్రలో నటిస్తోంది. జాక్వీలిన్ ఫెర్నాండజ్, అర్షద్ వార్షి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు