Kritishetty: అలాంటిదేదైనా ఉంటే నేనే చెబుతా

‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగువారిని అలరించిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాతోనే యువతలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్ట్‌లు....

Published : 18 May 2021 22:01 IST

రూమర్స్‌ నమ్మొద్దు అంటూ నటి పోస్ట్‌

హైదరాబాద్‌: ‘ఉప్పెన’తో బేబమ్మగా తెలుగువారిని అలరించిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమాతోనే యువతలో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుందంటూ ఇటీవల వరుస కథనాలు దర్శనమిచ్చాయి. అందులో బెల్లంకొండ గణేష్‌ చిత్రం  కూడా ఒకటి. అంతేకాకుండా ఆమె కొన్ని ప్రాజెక్ట్‌లు రిజెక్ట్‌ చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

కాగా, సదరు వార్తలపై నటి కృతిశెట్టి తాజాగా స్పందించారు. ప్రస్తుతానికి తాను కేవలం మూడు తెలుగు ప్రాజెక్ట్‌లు మాత్రమే చేస్తున్నట్లు వెల్లడించారు. ‘నా తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి వస్తోన్న ఎన్నో పుకార్లు ఇటీవల నా దృష్టికి వచ్చాయి. ఇప్పటివరకూ నేను కేవలం మూడు ప్రాజెక్ట్‌లకు మాత్రమే సంతకం చేశాను. అందులో ఒకటి నాని, మరొకటి సుధీర్‌బాబు, మూడోది రామ్‌ సినిమా. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లపైనే నా దృష్టి అంతా ఉంది. ఒకవేళ నేను ఏదైనా ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దయచేసి ఇంట్లోనే ఉండండి’ అని కృతి ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని