Lata Mangeshkar : గానకోకిల మూగబోయింది.. లతా మంగేష్కర్ ఇకలేరు..!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. కొవిడ్తో ఇటీవల
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. 30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.
ఐదో యేటనే మొదలైన పాటల ప్రస్థానం..
ప్రముఖ థియేటర్ యాక్టర్, క్లాసికల్ సింగర్ అయిన పండిట్ దీనానాథ్ మంగేష్కర్, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్ 28న లతామంగేష్కర్ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్, మీనా కదికర్లు లత మంగేష్కర్కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. లత పాఠశాలకు వెళ్లలేదు. ఒక రోజు తన సోదరి ఆశాను తీసుకుని పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయులు అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన, మొదటి చివరి రోజు కావటం గమనార్హం. ఆపై సంగీత సాధన మొదలు పెట్టిన ఆమె తండ్రి మరణంతో నటిగా మారాల్సి వచ్చింది. ఒకవైపు నటిస్తూనే, మరోవైపు పాటలు పాడటాన్ని ఆమె ఆపలేదు.
తొలి పాట ఎడిటింగ్లో పోయింది
లత మంగేష్కర్ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే, ఆ పాట సినిమాలో లేకపోవటం గమనార్హం. 1942లో ‘కిటీ హసాల్’ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్లో తీసేశారు. వినాయక్ మాస్టర్ సంగీత సారథ్యం వహించిన ‘పెహలీ మంగళాగౌర్’(1942)లో లతకు చిన్న వేషం ఇచ్చారు. ఇదే చిత్రంలో ఆమె ‘నటాలీ చైత్రాచీ’ అనే పాటలను పాడారు. హిందీలో ‘మాట ఏక్ సపూట్కి దునియా బదల్దా తు’ అనే పాటకు మరాఠీ చిత్రం ‘గజబావూ’ కోసం పాడారు. 1945లో వినాయక్ మాస్టర్ కంపెనీ ముంబయికి మారడంతో లత కూడా అక్కడే వెళ్లారు. ముంబయిలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. వేల పాటలను ఆలపించారు.
ఎన్ని పాటలో... ఎన్ని భాషలో...
ఆమె పాటలకు భాషాభేదం లేదు. దేశంలోని అన్ని భాషలలోనూ ఆమె పాడారు. తెలుగులో ఆమె పాడిన పాటలలో ఎప్పటికీ మర్చిపోలేని పాట ‘సంతానం’లోని ‘నిదురపోరా తమ్ముడా...’. ‘అజారే పరేదశి.. మైతో కబ్ సే ఖడీ హూరే..’ అనే అద్భుతమైన పాటను ‘మధుమతి’ చిత్రంలో పాడే చక్కని అవకాశం ఇచ్చి, ఫిల్మ్ఫేర్ ఉత్తమగాయనీ పురస్కారాన్ని అందించిన సంగీత దర్శకుడు సలీల్ ఛౌధురీ అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే ఆమె ఆయనపై అభిమానంతో తన జీవితంలో ఒకే ఒక పాట(‘కడలి...చెన్కడలి’)ను మలయాళంలోనూ పాడారు. ఆమెకు సంగీత దర్శకుడు మదన్మోహన్ అంటే చాలా అభిమానం. ఆయన వద్ద వందల ట్యూన్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిన లత, సుప్రసిద్ధ దర్శకుడు యశ్చోప్రాకు ఆ సంగతి చెప్పి, ‘ఆ ట్యూన్లను వాడుకుంటూ సినిమా తీయవచ్చు కదా’ అని పోరి మరీ, ‘వీర్ జరా’ చిత్రాన్ని తీయించారు.
స్వరకర్తగా... వ్యవహర్తగా...
కేవలం గాయనిగానే కాకుండా లతా మంగేష్కర్ జీవితంలో ఇంకా చెప్పుకోదగ్గ కోణాలూ, విశేషాలూ అనేకం ఉన్నాయి. మనందరికీ ఆమె సుప్రసిద్ధ గాయనిగానే పరిచయం. నేపథ్య గాయనిగా మంచి పేరు వచ్చాక, తన పేరుతోనే ‘రామ్రామ్ పహ్వానే’ అనే మరాఠీ చిత్రంతో సహా నాలుగు సినిమాలకు ఆమె సంగీత దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ మారిన లత ‘వాదాల్’ అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించారు. తరువాత, 1955లో ‘ఝంఝర్’, ‘కంచన్’ చిత్రానూ, 1990లో ‘లేకిన్’ చిత్రాన్నీ నిర్మించారు. వీటిలో ‘ఝంఝర్’ చిత్రాన్ని తనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు సి.రామచంద్రతో కలిసి నిర్మించడం విశేషం.
అత్యున్నత పురస్కారాలు ఆమెవే..!
భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. భారతీయ సంగీతానికి ఆమె అందించిన సేవలకు గానూ తొలిసారి 1969లో పద్మ భూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత 1999లో పద్మ విభూషణ్తో సత్కరించింది. 2001 భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణ్ చేతుల మీదుగా లతా మంగేష్కర్ అందుకున్నారు. ‘దాదా సాహెబ్ ఫాల్కే(1989) అవార్డులను అందుకున్నారు. ఇవే కాకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ‘ది లీజియన్ ఆఫ్ హానర్’ పురస్కారం పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు. -
ఎన్టీఆర్తో ఊర్వశి ఫొటో.. అందుకు క్షమాపణ చెప్పిన నటి
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటెల.. ఎన్టీఆర్తో సెల్ఫీ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
ఇది పక్కా సూపర్ హిట్: ‘పుష్ప 2’పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ డ్రామా ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). ఈ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించారు. -
శంకర్ కుమార్తె వివాహం.. సినీ తారల సందడి
ప్రముఖ దర్శకుడు శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..