Lata Mangeshkar: దేశం గర్వించే గాయని.. ప్రముఖులతో లతా మంగేష్కర్‌..

భారతరత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూతతో దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Updated : 06 Feb 2022 11:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతరత్న, ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూతతో దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారనుకున్న లతా.. ఇకలేరనే విషయాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు లతా మంగేష్కర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. గాయనిగా సినీ రంగానికి ఆమె అందించిన విశేష సేవలను స్మరించుకుంటున్నారు. భౌతికంగా లతా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె తన పాటలతో చిరస్మరణీయురాలిగా ఉంటారని పేర్కొంటూ అశ్రు నయనాలతో నివాళులర్పిస్తున్నారు. 

సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో లతా మంగేష్కర్‌ సత్సంబంధాలు కొనసాగించేవారు. దేశం గర్వించే గాయని కావడంతో ఆయా రంగాల్లోని ప్రముఖులంతా ఆమె పట్ల గౌరవభావంతో ఉండేవారు. లతా మరణం నేపథ్యంలో ప్రముఖులతో ఆమె దిగిన ఫొటోలను అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని