Bollywood: ఛోటే మియాతో జాన్వీ కపూర్
అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు.
అక్షయ్కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ (Bade Miyan Chote Miyan). అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఈ సినిమా చిత్రబృందంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు చేరినట్లు తెలుస్తోంది. ‘‘టైగర్ సరసన జాన్వీ నటించనుంది. ఆ పాత్ర కోసం కేవలం జాన్వీనే కోరుకుంటున్నారు అబ్బాస్’’అని చిత్రవర్గాలు చెప్పినట్లు సమాచారం. ఇందులో అక్షయ్కుమార్కు జోడీ ఎవరూ ఉండరట. వచ్చే నెల లండన్లో జరిగే జరగనున్న షెడ్యూల్లో జాన్వీ పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఊర్మిళ ద్విపాత్రాభినయం
ఊర్మిళ మండోత్కర్ (Urmila Matondkar) బాలీవుడ్ని ఊపేసిన కథానాయిక. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఆమె ‘తివారీ’ (Tiwari) అనే వెబ్సిరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె ఇందులో ద్విపాత్రాభినయం చేస్తుంది. తల్లీ కూతుళ్ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్లో రెండు పాత్రలనూ తనే పోషిస్తోంది. దీని కోసం గత ఆరు నెలలుగా ప్రత్యేకంగా సిద్ధం అవుతుంది ఊర్మిళ. దీని గురించి ఊర్మిళ స్పందిస్తూ ‘‘నాలోని నటికి ఓ సవాల్ విసురుతోంది ‘తివారీ’. ఇందులో అనుబంధాలే కాదు ఊహించని మలుపులు, యాక్షన్ ఘట్టాలు ఉంటాయి’’ అని చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి