Bollywood: ‘తోడేలు’ గీతాలాపన
‘తోడేలు’గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు వరుణ్ ధావన్. హిందీలో ‘బేడియా’గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మించింది.
‘తోడేలు’గా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు వరుణ్ ధావన్ (Varun Dhawan). హిందీలో ‘బేడియా’గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. అమర్ కౌశిక్ దర్శకుడు. కృతి సనన్ కథానాయిక. ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో నవంబర్ 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఆదివారం ‘‘తుంకేశ్వరి..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. సచిన్ జిగర్ స్వరపరిచిన ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్యరీతులు అందించారు. కార్తీక్, అనూష మణి ఆలపించారు. నటి శ్రద్ధా కపూర్ ఇందులో అతిథిలా మెరిసింది. వరుణ్ మాట్లాడుతూ.. ‘‘ఫ్లోర్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఇది. థియేటర్లో ప్రేక్షకులు ఈ పాటకు స్టెప్పులేస్తారు’’ అన్నారు.
డ్యాన్సర్గా.. రణ్బీర్
ఆదిత్య సీల్, నిఖితా దత్తా జంటగా రూపొందుతున్న సంగీత ప్రధాన చిత్రం ‘రాకెట్ గ్యాంగ్’ (Rocket Gang). ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో లెస్లీ మార్టిస్కి ఇది దర్శకుడిగా తొలి సినిమా. ఇందులో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒక ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. ఈ వివరాల్ని సినీవర్గాలు ఆదివారం ప్రకటించాయి. మార్టిస్ రణ్బీర్ నటించిన ‘తమాషా’, ‘రాక్స్టార్’లకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రణ్బీర్ మంచి నటుడే కాదు.. మంచి డ్యాన్సర్ కూడా. మా సినిమాకి ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇది పిల్లలు, యువతకు బాగా నచ్చుతుంది’ అన్నారు. ‘రాకెట్ గ్యాంగ్’ నవంబరు 11న విడుదలవుతోంది.
‘స్త్రీ 2’తో మళ్లీ భయపెడతా..
భారీ విజయంతో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) కెరీర్ని మరో మెట్టు ఎక్కించిన చిత్రం ‘స్త్రీ’ (Stree). ఈ హారర్ కామెడీని దర్శకుడు అమర్ కౌశిక్ తెరకెక్కించారు. దినేష్ విజన్ నిర్మాత. త్వరలోనే ఈ సినిమా రెండోభాగం మొదలవుతుంది అంటూ శ్రద్ధ ఆదివారం ప్రకటించారు. తను ప్రస్తుతం ‘భేడియా’ చిత్రం పాట షూటింగ్లో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తాజా సమాచారం జోడించారు. ‘మళ్లీ సెట్లోకి రావడం చాలా ఉత్సాహంగా ఉంది. ఇదే ఊపుతో అతి త్వరలోనే ‘స్త్రీ 2’ (Stree 2) షూటింగ్ మొదలవనుంది’ అని అందులో పేర్కొన్నారు. ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. శ్రద్ధ ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది.
కలిసే సాగుదాం..
అజయ్ దేవ్గణ్, శ్రియా శరణ్, తబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘దృశ్యం 2’ (Drishyam 2). మలయాళ ‘దృశ్యం 2’ ఆధారంగా టీ సిరీస్, పనోరమా స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అభిషేక్ పాఠక్ దర్శకుడు. ‘హమ్ సాత్ రహే...’ అంటూ సాగే ఈ సినిమా మొదటి సాంగ్ గ్లింప్స్ని ఆదివారం విడుదల చేశారు. అజయ్ దేవ్గణ్ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రాయగా, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. నవంబరు 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్