Cinema News: సంక్షిప్త వార్తలు (5)
నయనతార పుట్టినరోజుని పురస్కరించుకుని కొత్త సినిమాని ప్రకటించారు ఆమె భర్త, దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్. నయనతార 81వ చిత్రంగా పట్టాలెక్కనున్న ఆ సినిమాకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు.
చిన్నారులకి నచ్చేలా
నయనతార (Nayanthara) పుట్టినరోజుని పురస్కరించుకుని కొత్త సినిమాని ప్రకటించారు ఆమె భర్త, దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్. నయనతార 81వ చిత్రంగా పట్టాలెక్కనున్న ఆ సినిమాకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులకు, చిన్నారులకి నచ్చేలా ఆ సినిమా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘కనెక్ట్’ (Connect) సినిమా టీజర్ కూడా శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలైంది.
రజనీ హంగామా
‘జైలర్’(Jailer) చిత్రీకరణతో బిజీ బిజీగా గడుపుతున్నారు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth). నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కన్నడ కథానాయకుడు శివరాజ్కుమార్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. రజనీకాంత్ తన మార్క్ స్టైల్తో అందులో కనిపించారు. ఆయన లుక్, స్టైల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రజనీకి జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
నవ్వుల సిత్రాలు
లక్ష్మణ్ కథానాయకుడిగా రైజింగ్ హ్యాండ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారాం సిత్రాలు’ (SitaRamam Sitralu). భ్రమరాంబిక కథానాయిక. డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థసారథి, డి.నాగేందర్రెడ్డి నిర్మాతలు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా టైటిల్ లోగోని ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.గుహన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా పేరు కొత్తగా ఉంది. హాస్యం ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. అందరినీ నవ్వించే చిత్రమిదన్నారు దర్శకుడు. కిశోరి ధాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రుద్రకిరణ్, ఛాయాగ్రహణం: అరుణ్కుమార్ పర్వతనేని.
నన్నయ్య రాసిన...
నిఖిల్ సిద్ధార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘18 పేజీస్’ (18 Pages). పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి, జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నన్నయ్య రాసిన... ’ అంటూ సాగే వీడియో గీతాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్టు తెలిపాయి సినీ వర్గాలు. అగ్ర దర్శకుడు సుకుమార్ రాసిన కథతో రూపొందుతున్న సినిమా ఇది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
‘దంగల్’లో ఆమిర్లా మారే పనిలో కార్తీక్
ప్రముఖ హిందీ దర్శకుడు కబీర్ఖాన్ దర్శకత్వంలో యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కార్తీక్ బాక్సర్గా నటించనున్నాడట. అందుకోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఓ మంచి బాక్సర్గా తెరపై కనిపించాలంటే శరీరం ఎలా ఉండాలో అలా తన దేహాన్ని తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడు. దీని కోసం రాజ్కోట్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. మల్లయోధుడిగా నటించి ఆమిర్ఖాన్ భారీ విజయం అందుకున్న చిత్రం ‘దంగల్’. ఈ చిత్రం కోసం ఆమిర్కు శిక్షణ ఇచ్చిన రాహుల్భట్ ఆధ్వర్యంలోనే కార్తీక్ కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. దీంతో పాటు ‘సత్యప్రేమ్ కీ కథ’ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!