Cinema News: సంక్షిప్త వార్తలు
నవీన్చంద్ర కథానాయకుడిగా భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తగ్గేదే లే’. ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. ప్రేమ్కుమార్ నిర్మాత. ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సినిమా విషయంలోనూ జరిగేది అదే!
నవీన్చంద్ర (Naveen Chandra) కథానాయకుడిగా భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తగ్గేదే లే’ (Thaggedhe Le). ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు. ప్రేమ్కుమార్ నిర్మాత. ఈ నెల 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తొలి లాక్డౌన్కీ, రెండో లాక్డౌన్కీ మధ్యలో తెరకెక్కించిన చిత్రమిది. ప్రేమ, ప్రతీకారం, యాక్షన్ అంశాలతో కూడిన కథ ఇది. మూడు కథల్ని ఓ సినిమాలో మేళవించిన తీరు కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శకుడు శ్రీనివాస్రాజు మాట్లాడుతూ ‘‘మంచి నటులు, నిర్మాణ సంస్థవల్లే ఈ సినిమా సాధ్యమైంది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. పూజా గాంధీ మాట్లాడుతూ ‘‘మేం ‘దండుపాళ్యం’ ప్రయాణం మొదలుపెట్టి 12 ఏళ్లు అవుతుంది. మా గ్యాంగ్ ఉన్న చోటంతా ఓ మేజిక్ జరిగింది. ‘తగ్గేదేలే’ విషయంలోనూ అదే మేజిక్ పునరావృతం అవుతుంది’’ అన్నారు. ‘‘యథార్థ ఘటనల్ని తెరపై ఆవిష్కరించే లక్ష్యంతోనే ఈ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశాం. ’’ అన్నారు నిర్మాత ప్రేమ్కుమార్. కార్యక్రమంలో మకరంద్ దేశ్పాండే, దివ్య పిళ్లై, అనన్య, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయ్తో విశాల్?
తమిళ కథానాయకుడు విజయ్ (Vijay)..దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్ (Vishal) ఓ కీలక పాత్రల్లో నటిస్త్నుట్లు తెలుస్తోంది. విజయ్ 67వ చిత్రంగా రానున్న ఈ సినిమాలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు కనిపించే అవకాశం ఉందట. గ్యాంగ్స్టర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కొంచెం ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారట విశాల్. ముందు ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్ని అనుకున్నా ఆయన కాల్షీట్లు సర్దుబాటు కాకపోవడంతో అవకాశం విశాల్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. తను విజయ్ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో విశాల్ వెల్లడించారు.
మల్లయోధుడి ‘మట్టికుస్తీ’
విష్ణు విశాల్ (Vishnu Vishal) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రవితేజతో కలిసి విష్ణు విశాల్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ని గురువారం కథానాయకుడు రవితేజ విడుదల చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. విష్ణు విశాల్ మల్లయోధుడిగా తెరపై సందడి చేస్తారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్.
ఈఫిల్ టవర్ సాక్షిగా ఐ లవ్ యు
అందమైన ఈఫిల్ టవర్ సాక్షిగా అంతకంటే అందమైన అమ్మాయికి తన ప్రేమను వ్యక్తం చేసి తనను పెళ్లి చేసుకోమని కోరుతున్నాడు ఓ ప్రేమికుడు. అతడే వ్యాపారవేత్త సోహైల్ కతురియా. అందాల కథానాయిక హన్సికను (Hansika) ఆయన వివాహం చేసుకోనున్నారు. ఇందులో భాగంగా నిశ్చితార్థం కార్యక్రమాన్ని కాస్త వైవిధ్యంగా ప్లాన్ చేశారు సోహైల్. ఈఫిల్ టవర్కు దగ్గర్లో ఉన్న ఓ ప్రదేశంలో పువ్వులు, కొవ్వొత్తుల నడుమ ‘మ్యారీ మీ’ అంటూ అలకరించి వాటి మధ్యలో హన్సికకు తన ప్రేమను వ్యక్తం చేశారు సోహెల్. హన్సిక ఈ ఫొటోలను ఇన్స్టాలో పంచుకుంది. డిసెంబరు 4న రాజస్థాన్లో వీళ్ల పెళ్లి జరిగే అవకాశం ఉంది.
మెర్క్యురీ సూరి
‘తిమ్మరుసు’ తర్వాత కథానాయకుడు సత్యదేవ్ (Satyadev) - దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కలిసి చేస్తున్న చిత్రం ‘ఫుల్బాటిల్’ (Full Bottle). ఎస్.డి.కంపెనీతో కలిసి స్రవంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సత్యదేవ్ పోషించిన మెర్క్యూరీ సూరి పాత్రకి సంబంధించిన లుక్ని బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్.
‘భేడియా’ హంగామా
నిర్మాత దినేశ్ విజన్ హారర్ కామెడీ ప్రపంచంలో భాగంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘భేడియా’ (Bhediya). వరుణ్ ధావన్ కథానాయకుడు. కృతిసనన్ కథానాయిక. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 25న హిందీతోపాటు, తమిళం, తెలుగు భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘తోడేలు కాటుకు గురైన భాస్కర్ అనే యువకుడిగా వరుణ్ ధావన్... డాక్టర్ అనిక పాత్రలో కృతిసనన్ నటించిన చిత్రమిది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ మరోసారి కథాబలం ఉన్న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు