Cinema News: సంక్షిప్త వార్తలు(5)
‘మానాడు’ విజయంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు శింబు. ప్రస్తుతం ‘పతు తలా’ చిత్రంతో సెట్స్పై బిజీగా గడుపుతున్నారు.
సోదరి కోసం గాయత్రి ఏం చేసింది?
ఆ ఇద్దరూ కవల పిల్లలు...ఎంతో అన్యోన్యంగా పెరుగుతారు. అనుకోకుండా ఒకరు చనిపోతారు. అప్పుడు రెండో అమ్మాయి గాయత్రి ఆ మరణాన్ని చేధించే పనిలో పడుతుంది. కానీ ఆమె కంటి చూపు మందగిస్తుంది. మరి చివరికి తను అనుకున్నది ఎలా సాధించిందో తెలియాలంటే ‘బ్లర్’ (BLUR) చూడాల్సిందే. తాప్సి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఈ చిత్రంతోనే ఆమె నిర్మాతగానూ మారింది. ఈ సినిమాని ఓటీటీ ద్వారా వచ్చే నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక వీడియో ద్వారా తెలియజేసింది తాప్సి (Taapsee). అజయ్ భల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం స్పానిష్ సినిమా ‘జులియాస్ ఐస్’కు హిందీ రీమేక్.
ప్రేక్షకుల స్పందన ఉత్సాహాన్నిచ్చింది
తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ తమిళంలో నిర్మించిన తొలి చిత్రం ‘కిడ’ (Kida). పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు నటించారు. తాత, మనవడు, మేక చుట్టూ సాగే ఈ కథని కొత్త దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ తెరకెక్కించారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ఈ సినిమా ప్రదర్శితమైంది. అక్కడ వీక్షించిన ప్రేక్షకుల నుంచి లభించిన స్పందన ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు స్రవంతి రవికిషోర్. ఆయన మాట్లాడుతూ ‘‘చెన్నై వెళ్లినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తనొక కథ చెప్పాడు. ఆ కథ నచ్చి దర్శకుడికి కబురుపెట్టా. అతను ఈ కథని, సినిమాని తెరకెక్కించాలనుకున్న విధానాన్ని తెలుసుకుని వెంటనే ఓకే చెప్పా. తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకి న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. మా సంస్థకి ఇదే తొలి తమిళ సినిమా. సినిమాకి భాషా పరమైన హద్దులు లేవు. మంచి సినిమా వస్తే ఎక్కడైనా చూస్తారు. త్వరలోనే తెలుగులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా బాల్యంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశా. మధురైకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో తీశాం. పనోరమా విభాగంలో సినిమా ప్రదర్శితమయ్యాక థియేటర్లో అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. మాకు దక్కిన గొప్ప గౌరవం ఇది’’ అన్నారు.
శివ కార్తికేయన్ పోరాటాలు
శివ కార్తికేయన్ (sivakarthikeyan) తమిళ కథానాయకుడే అయినా ఆయన చిత్రాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘మావీరన్’ (maaveeran). ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో కీలక షెడ్యూల్ చెన్నైలో మొదలుకానుంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో వీటిని తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై శివ కార్తికేయన్ అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో అదితి శంకర్ నాయికగా నటిస్తోంది. మిస్కిన్, సరిత, యోగిబాబుతో పాటు తెలుగు నటుడు సునీల్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదల కానుంది.
స్వరాల ‘ధమాకా’
మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ధమాకా’ (Dhamaka) ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి శుక్రవారం ‘డు డు...’ అంటూ సాగే పాటని విడుదల చేయనున్నారు. బుధవారం ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రమిది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత.డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్తో కూడిన చిత్రమిది. రవితేజ నటన, శ్రీలీల అందం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన డు డు... పాటలో రవితేజ స్టైలిష్ నృత్యాలు ఆకట్టుకుంటాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ప్లే: ప్రసన్నకుమార్ బెజవాడ, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని.
సూపర్ హీరోగా శింబు?
‘మానాడు’ విజయంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు శింబు (Simbu). ప్రస్తుతం ‘పతు తలా’ చిత్రంతో సెట్స్పై బిజీగా గడుపుతున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న సినిమా ఏదన్నది ఇంత వరకు తేలలేదు. సుధ కొంగరతో ఓ చిత్రం చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించినా.. తర్వాత ఏ స్పష్టతా రాలేదు. ప్రస్తుతం తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శింబు తర్వాతి చిత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. దీనికి మురుగదాస్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఆయన శింబు కోసం ఓ సూపర్ హీరో కథ సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో శింబు ఈ ప్రాజెక్ట్కు ఓకే చెప్పారని టాక్. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై