Cinema News: సినీ ముచ్చట్లు.. కొత్త సినిమా విశేషాలు
తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో స్వప్న చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘నమస్తే సేట్ జీ’ (Namaste SetJi). డిసెంబర్ 9న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైజాగ్లో ‘నమస్తే సేట్ జీ’ టీమ్ సందడి
తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో స్వప్న చౌదరి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘నమస్తే సేట్ జీ’ (Namaste SetJi). డిసెంబర్ 9న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ టూర్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మంగళవారం వైజాగ్లో టీమ్ సందడి చేసింది. విశాఖ 32 డివిజన్ కార్పొరేటర్ కందుల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. లాక్డౌన్లో జరిగిన కథలను ఆధారంగా చేసుకుని కిరాణా షాపు నడిపే వ్యక్తుల జీవనవిధానాన్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకుల్ని కోరారు. తమ సినిమాను ఆదరించాలని నటీనటులు కోరారు. అనంతరం నాగరాజు పుట్టినరోజుని పురస్కరించుకుని టీమ్ సెలబ్రేట్ చేసింది.
ఓటీటీలో విస్ఫోట్
‘ప్రేమ్ అగ్గన్’, ‘ఖుషీ’, ‘ఫిదా’, ‘డార్లింగ్’ చిత్రాలతో మెప్పించిన హీరో ఫర్దీన్ఖాన్ (Fardeen Khan). చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఫర్దీన్ ‘విస్ఫోట్’తో గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో రితేష్ దేశ్ముఖ్ మరో కథానాయకుడు. కుకీ గులాటీ దర్శకుడు. భారీ యాక్షన్ చిత్రంగా ముస్తాబవుతున్న ఈ ఫిల్మ్ వచ్చే ఏడాది ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నిర్మాత సంజయ్ గుప్తా మంగళవారం తెలిపారు. ‘ముందు థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నాం. బాక్సాఫీస్ పరిస్థితులు బాగా లేనందున ఓటీటీకి వెళ్తున్నాం’ అని సంజయ్ గుప్తా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇది వెనిజులా చిత్రం ‘రాక్ పేపర్ సిసర్స్’ ఆధారంగా రూపొందుతోంది. ప్రియా బాపట్, క్రిస్టల్ డిసౌజా ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
‘భూల్ భులయ్యా 2’ దర్శకుడితో..
హాస్య చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు.. అనీస్ బజ్మీ. విభిన్న జానర్స్లో నటిస్తూ వస్తున్న కథానాయకుడు వరుణ్ ధావన్ (Varun Dhawan). మొదటిసారి ఈ ఇద్దరి కలయికలో ఓ యాక్షన్ కామెడీ చిత్రం రూపొందనుంది. ‘ఈ ఇద్దరి కలయికలో వచ్చే ఏడాది కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఇది యాక్షన్, హాస్యం కథాంశంతో తయారవుతుంది’ అని సినీవర్గాలు తెలిపాయి. అనీస్ బజ్మీ చివరిసారి ‘భూల్ భులయ్యా 2’తో భారీ విజయం అందుకోగా.. వరుణ్ ధావన్ ‘భేడియా’తో ఆకట్టుకున్నాడు.
తాప్సి పరిశోధన ఫలించిందా?
తాప్సి (Taapsee) ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘బ్లర్’ (BLUR). స్పానిష్ చిత్రం ‘జూలియాస్ ఐ’ ఆధారంగా అజయ్ బహల్ తెరకెక్కిస్తున్నారు. మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో తాప్సి.. గాయత్రి, గౌతమిగా ద్విపాత్రాభినయం చేస్తోంది. ఇద్దరిలో అంధురాలైన గౌతమి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రైలర్ మొదలవుతుంది. పోలీసులు, గాయత్రి భర్త దీన్ని ఆత్మహత్యగానే భావిస్తుంటారు. దీన్ని నమ్మని గాయత్రి ఇది హత్యగా భావించి సొంతంగా పరిశోధన ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తనూ క్రమంగా కంటిచూపు కోల్పోయే దశకొస్తుంది. ఈలోపే.. ఆమె సోదరిది హత్యా.. ఆత్మహత్యా.. అని తెలుసుకుంటుందా? తర్వాత ఏం జరిగిందో.. తెరపై చూడాల్సిందే. టోనీ డిసౌజా, ప్రదీప్ శర్మ, మానవ్ దుర్గా నిర్మిస్తున్న ఈ చిత్రం జీ5 ఓటీటీలో డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఉగ్రవాదిని చంపిన కశ్మీరీ అమ్మాయిగా?
మరోసారి బయోపిక్లో నటించడానికి సిద్ధమవుతోంది శ్రద్ధాకపూర్ (Shradha Kapoor). గతంలో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథతో తెరకెక్కిన చిత్రంలో నటించింది శ్రద్ధ. ఇప్పుడు ధైర్యవంతమైన ఓ యువతి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 2009లో ఉగ్రవాదులు తన ఇంటిపై దాడి చేసిన సమయంలో ధైర్యంగా ఓ ఉగ్రవాదిని చంపిన కశ్మీరీ అమ్మాయి రుక్సానా స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు ఆ కథలో శ్రద్ధాకపూర్ నటించే అవకాశాలున్నాయని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆమె ‘స్త్రీ 2’తో పాటు లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్కపూర్తో ఓ చిత్రంలో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్
తన మొదటి సినిమా సల్మాన్తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్ చెప్పారు. -
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ