Chiranjeevi: పీవీ సింధుకు సత్కారం.. రానా రాగానే చిరు పంచ్‌లు

Chiranjeevi: ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును చిరు కుటుంబం ఘనంగా సత్కరించింది.

Updated : 28 Aug 2021 21:43 IST

హైదరాబాద్‌: రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి దేశ చరిత్రలో సంచలనం సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ వీపీ సింధును అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సింధును ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఇటీవల ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు నాగార్జునతో పాటు సీనియర్ కథానాయికలు రాధిక, సుహాసిని సహా చిరంజీవి కుటుంబసభ్యులు, ఆత్మీయులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు.

ఈ సందర్భంగా సింధు సాధించిన విజయాలను చిరు కొనియాడారు. సింధును చూసి దేశం మురిసిపోతుంటే తన బిడ్డే అనే భావన కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి కుటుంబం తనపై చూపించిన ప్రేమ, గౌరవాన్ని ఎప్పటికి గుర్తుంచుకుంటానన్న సింధు..  వచ్చే ఒలింపిక్స్‌లో తప్పకుండా బంగారు పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. సింధు సాధించిన కాంస్య పతకంతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతూ సందడిగా గడిపారు. అమ్మవారి విగ్రహాన్ని బహుకరించి సింధుని ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి సామాజిక వేదిక ద్వారా మెగా అభిమానులతో పంచుకున్నారు. ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సాగిన ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని