18 ఏళ్ల తర్వాత స్టేజ్‌పై నటి డ్యాన్స్

డ్యాన్స్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని ఫుల్‌ ఖుష్‌ చేస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ఈ షో ప్రసారం అవుతోంది....

Published : 13 Jul 2021 01:11 IST

హైదరాబాద్‌: డ్యాన్స్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ ఫేమ్‌ సుడిగాలి సుధీర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ఈ షో ప్రసారం అవుతోంది. తాజాగా 25వ ఎపిసోడ్‌ సెలబ్రేషన్స్ సందడిగా జరిగాయి. ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ కమెడియన్ల పంచులు, ‘ఢీ’ డ్యాన్సర్ల హుషారెత్తించే డ్యాన్సులు, సోషల్‌మీడియా స్టార్స్‌ సరదా జోకులతో ఎపిసోడ్‌ సాగింది.

షోలో భాగంగా ప్రముఖ నటి ఇంద్రజ స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అందరి చూపుల్ని తనవైపు తిప్పుకొన్నారు. ‘మెరిసింది మేఘా మేఘా’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు చూసి అందరూ వావ్‌ అనకుండా ఉండలేకపోయారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత స్టేజ్‌పై మళ్లీ డ్యాన్స్ చేశానని ఆమె తెలిపారు. అనంతరం తోటి నటి లైలాతో కలిసి సరదాగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షో వేడుకలు పూర్తిగా చూడాలంటే వచ్చే ఆదివారం వరకూ వేచి చూడాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని