NTR: ఎన్టీఆర్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’... ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ వినగానే తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌ (NTR) అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

Updated : 07 Dec 2022 16:15 IST

హైదరాబాద్‌: ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’... ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ వినగానే తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా ఎన్టీఆర్‌ (NTR) అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్‌ హీరోగా వెండితెరకు పరిచయమైన తొలినాళ్లలో విడుదలైన ‘ఆది’(Aadi)లోని డైలాగ్‌ ఇది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్‌ నిర్మాతగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ‘ఆది’ విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదే విషయాన్ని తాజాగా బెల్లంకొండ సురేశ్‌ బయటపెట్టారు. ‘‘ఆది’ రీ రిలీజ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నాం. గతేడాది కేవలం ఫ్యాన్స్‌ షో మాత్రమే వేశాం. కాకపోతే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం. ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని సురేశ్‌ వివరించారు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిత్రాన్ని త్వరగా చూడాలనుకుంటున్నట్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇక, నవంబర్‌లో ‘ఆది’ రీ రిలీజ్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీమలోని ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోని సూపర్‌హిట్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని