vijay Deverakonda: అలెప్పీలో ‘ఖుషి’ ఖుషీగ

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మురళీ శర్మ, జయరాం, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 02 Apr 2023 06:59 IST

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ (Kushi). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మురళీ శర్మ, జయరాం, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్ర కొత్త షెడ్యూల్‌ అలెప్పీలో మొదలైంది. ఈ విషయాన్ని దర్శకుడు శివ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. దాదాపు వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌లో విజయ్‌, సమంతలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ‘‘రెండు భిన్నమైన నేపథ్యాలు కలిగిన ఓ జంట మధ్య సాగే ఆహ్లాదకరమైన ప్రేమ కథా చిత్రమిది. కశ్మీర్‌ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో విజయ్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌, ఛాయాగ్రహణం: జి.మురళి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని