Tollywood: శర్వానంద్‌- రష్మిక సర్‌ప్రైజ్‌.. సమంత- నయనతార ఫొటోలు వైరల్‌!

శర్వానంద్‌, రష్మిక సినీ అభిమానులకు కానుక అందించారు. తామిద్దరు కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోని ‘ఆద్య’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.

Published : 01 Apr 2022 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత, నయనతార, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే పేరుతో విడుదల కానుంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. గురువారం చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సెట్స్‌లో చిత్ర బృందం సందడి చేసింది. నాయికానాయికలు, దర్శకుడు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లవ్‌, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్‌ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 28న విడుదలకానుంది.

ఫుల్‌ వీడియోతో..

శర్వానంద్‌, రష్మిక సినీ అభిమానులకు కానుక అందించారు. తామిద్దరు కలిసి నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోని ‘ఆద్య’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులోని బీచ్‌, గుడి తదితర అందమైన లొకేషన్లు, శర్వానంద్‌ కూల్‌ డ్యాన్స్‌, రష్మిక అందం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని యాజిన్‌ నైజర్‌ ఆలపించగా దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ కుటుంబ కథా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని