Tollywood: సంక్షిప్త వార్తలు (5)
‘‘సర్దార్’ని చాలా ప్రతిష్ఠాత్మకంగా చేశాం. దీనికోసం ఓ యుద్ధంలా పనిచేశాం. మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు మంచి ఫలితం అందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పిఎస్.మిత్రన్ తెరకెక్కించారు.
మరోసారి నిరూపించారు
‘‘సర్దార్’ని (Sardar) చాలా ప్రతిష్ఠాత్మకంగా చేశాం. దీనికోసం ఓ యుద్ధంలా పనిచేశాం. మేము పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రేక్షకులు మంచి ఫలితం అందించారు. చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు కార్తి (Karthi). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పిఎస్.మిత్రన్ తెరకెక్కించారు. తెలుగులో నాగార్జున విడుదల చేశారు. ఇది ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో సక్సెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘కొత్తగా చేస్తే ఆదరిస్తామని ‘సర్దార్’తో ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఈ చిత్రం చూశాక నీళ్ల బాటిల్ చూస్తే భయపడుతున్నారు. సినిమా అనేది మన కల్చర్గా ఉన్న ఈ దేశంలో ఒక నటుడిగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు. ‘‘ఎక్కడ మంచి సినిమా ఉన్నా చూసేది తెలుగు ప్రేక్షకులే. నిజంగా వీళ్లు దేవుళ్లు’’ అన్నారు నిర్మాత సుప్రియ.
రచయిత.. సోనూసూద్
అదేంటి ఆయన నటుడు కదా అనుకుంటున్నారా...కానీ ఈసారి నటనతో పాటు స్క్రిప్ట్, స్క్రీన్ప్లే పైనా దృష్టిపెట్టారు. తనదైన నటనతో పాటు, సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ (Sonu Sood) తొలిసారి రచయితగా మారి స్రిప్ట్ని సిద్ధం చేయడమే కాదు స్క్రీన్ప్లే కూడా అందించారు. అదే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఫతే’ చిత్రం. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుంది. దీని గురించి సోనూ మాట్లాడుతూ ‘‘ఈ కథపై ఏడాదిన్నరగా పనిచేస్తున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్, స్క్రీన్ప్లే కోసం చాలా కష్టపడ్డాను. గతంలో కూడా పలు చిత్రాలకు పనిచేసినా ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లేకు నా పేరు వేస్తున్నారు’’అని చెప్పారు. డిజిటల్ మోసాల నేపథ్యంలో సాగే కథ ఇది. అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్పైకి వెళ్లనుంది.
ఓ మంచి సాహసయాత్రలా..!
‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ (Like Share Sunscribe). మంచి అడ్వంచరస్, థ్రిల్ ట్రిప్లా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సంతోష్ శోభన్ (Santosh Sobhan), ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రమిది. వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో హీరో సంతోష్ మాట్లాడుతూ.. ‘‘మేర్లపాక ఇచ్చిన కథతో ‘ఏక్ మినీ కథ’ చేశా. మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించా. చాలా సంతోషంగా ఉంది. ఈనెల 25న ప్రభాస్ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో సంతోష్, ఫరియా ట్రావెల్ వ్లోగ్గేర్గా కనిపిస్తారు. అందుకే ఈ సినిమాకి ‘లైక్ షేర్ అండ్ సబ్స్కైబ్’ అనే టైటిల్ పెట్టాం’’ అన్నారు చిత్ర దర్శకుడు గాంధీ. ఈ కార్యక్రమంలో వెంకట్ బోయనపల్లి, బ్రహ్మాజీ, ఫరియా తదితరులు పాల్గొన్నారు.
ఆ ఆలోచనే ‘ప్రిన్స్’కు స్ఫూర్తి
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచనే ‘ప్రిన్స్’ (Prince) కథకు స్ఫూర్తి. దీన్ని వినోదాత్మకంగా చెప్పాలనుకున్నాం. మేము చేసిన ఈ ప్రయత్నానికి ఇప్పుడు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది’’ అన్నారు అనుదీప్ (Anudeep). ఆయన దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రమే ‘ప్రిన్స్’. సునీల్ నారంగ్, డి.సురేష్బాబు, పుస్కూర్ రామ్ మోహన్రావు నిర్మించారు. మరియా ర్యాబోషప్క కథానాయిక. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్లో సినిమాలు చేయాలి. తర్వాతి ప్రాజెక్ట్పై 15రోజుల్లో స్పష్టత ఇస్తా’’ అన్నారు.
ప్రేమ ఓడిపోదు
హేమలత రెడ్డి కథానాయికగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘నిన్నే చూస్తు’. కె.గోవర్ధనరావు తెరకెక్కించారు. శ్రీకాంత్ గుర్రం హీరో. సుమన్, సుహాసిని, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ‘‘ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంత వరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు’ అని చెప్పే ప్రేమకథా చిత్రమిది. దీన్ని ప్రేక్షకులు ఆదరించి.. ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అన్నారు దర్శకుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM