Tollywood: ఒకే రూమ్లో.. చిత్రీకరణ
అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మ మగన్ తెరకెక్కించిన చిత్రం ‘రూమ్’. వి.యస్.సుబ్బారావు నిర్మాత.
అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా పద్మ మగన్ తెరకెక్కించిన చిత్రం ‘రూమ్’ (Room). వి.యస్.సుబ్బారావు నిర్మాత. బెనర్జీ, సంపత్ రామ్, తెరి దీన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో మంచి కథ ఉంది. కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్నా.. అది పరిమితంగానే ఉంటుంది. ఈ చిత్రాన్ని 60శాతం ఒకే రూమ్లో షూట్ చేశాం. నన్ను నమ్మి నాకీ అవకాశమిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు హీరో అభిషేక్. కార్యక్రమంలో ప్రసన్న కుమార్, బెనర్జీ, రామరాజ్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛపై చర్చించే చిత్రం
కల్పనా తివారీ ప్రధాన పాత్రలో రామ్ అల్లాడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేజెస్’ (Pages). ఏ.ఆర్.ఐ.టి. వర్క్స్ ఇండియా సంస్థ నిర్మిస్తోంది. పంకజ్ మున్షీ, ఆనంద్ రంగరాజన్, శిల్పా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ అల్లాడి మాట్లాడుతూ.. ‘‘సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో ప్రధాన అంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో సాగే కథ ఇది. దిల్లీ, బంగ్లాదేశ్లోని నవఖాలితో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది. ఇది పూర్తిగా కల్పిత కథే. ఇందులో కల్పనాతో పాటు మరో ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్లలో చిత్రీకరణ జరుపుతున్నాం’’ అన్నారు. సంగీతం: శ్రీవర్ధన్ సాయి, ఛాయాగ్రహణం: కృష్ణ గుంటుపల్లి, రామ్ అల్లాడి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..