Cobra: ‘కోబ్రా’ వచ్చేది ఆరోజే
విక్రమ్ హీరోగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం
విక్రమ్ హీరోగా ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’. ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్ పంచుకుంది. సినిమాలో ఆయన దాదాపు 25 గెటప్పుల్లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు నిర్మాత తెలిపారు. దీనికి ఏఆర్.రెహమాన్ స్వరాలు సమకూర్చారు. హరీశ్ కణ్ణన్ ఛాయాగ్రహణం అందించారు.
కార్తికేయన్.. ‘మావీరన్’
వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్. ఇటీవలే ‘డాన్’గా ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ప్రస్తుతం కె.వి.అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇది పూర్తయిన వెంటనే శివ కార్తికేయన్, కమల్హాసన్ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నారు. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించనున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాకి ‘మావీరన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో కార్తికేయన్ శక్తిమంతమైన ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పూర్వ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయిపల్లవి నాయిక.
థ్రిల్లింగ్ ప్రయాణం
నిఖిల్ కుమార్, షిఫా జంటగా మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన చిత్రం ‘కరణ్ అర్జున్’. సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బోర్డర్లో చిత్రీకరణ జరిపారు. ట్రైలర్ లాగే సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘మూడు పాత్రలతో రోడ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. థియేటర్లో ప్రేక్షకుల్ని అలరిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ సినిమాకి సంగీతం: రోషన్ సాలూరి, ఛాయాగ్రహణం: మురళికృష్ణ వర్మన్.
వినూత్నమైన ప్రేమకథతో..
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే జంటగా నటించిన చిత్రం ‘ఓ మై లవ్’. స్మైల్ శ్రీను దర్శకుడు. జి.రామాంజని నిర్మించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీజర్ చూస్తే.. అందమైన ప్రేమకథతో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. నిర్మాతకు మంచి లాభాలు దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సంగీతం: చరణ్ అర్జున్, ఫైట్స్: రియల్ సతీష్.
‘రుద్ర సింహ’.. ప్రతీకార కథ
సంతోష్, స్నేహ, మైత్రి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘రుద్ర సింహ’. మనోహర్ కాటేపోగు దర్శకుడు. ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్రావు జింకల, మనోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రతీకార కథతో రూపొందుతోన్న యాక్షన్ చిత్రమిది. ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయ’’న్నారు. సంగీతం: టి.రాజేష్ రాజ్, ఛాయాగ్రహణం: జి.ఉదయ్ కుమార్.
వెంటపడే ఆ చిన్నాడెవడు?
తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం ‘నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా’. ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఒక అమ్మాయికి తెలియకుండా ఓ అబ్బాయి వెంటపడుతుంటాడు. ఆ విషయం ఆమెకి తప్ప ఊర్లో ఉన్న వాళ్లందరికీ తెలుస్తుంది. దాని వల్ల ఆ అమ్మాయికి వచ్చే సమస్యలేంటి? ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా కలిసింది? అన్నది మిగతా చిత్ర కథ. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. వెంకట్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. సందీప్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం