K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
అగ్రదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Viswanath) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (K.Viswanath passed away)
హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్ (K.Viswanath) (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు(K.Viswanath passed away) వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. (K.Viswanath is no more)
కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్గా పనిచేశారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.
సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు. ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి... ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ఇక విశ్వనాథ్ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్ (59వ)చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా పసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్తో గౌరవించింది.
శంకరాభరణం విడుదలైన రోజే..
ఈ లెజెండరీ డైరెక్టర్ చేతుల్లోంచి జాలువారిన మరో ఆణిముత్యం ‘శంకరాభరణం’. ఆయన చిత్రాల్లో ఈ ‘శంకరాభరణం’చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమలో ఒక సంచలనం. సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రానంతరమే కె.విశ్వనాథ్ ‘‘కళాతపస్వి’గా పేరుపొందారు. అయితే ‘శంకరాభరణం’ విడుదలైన రోజే ఆయన శివైక్యం చెందడం బాధాకరం.
ఆస్కార్కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం..
మొదటి చిత్రంతోనే మంచి పేరుతెచ్చుకున్న కాశీనాథుని విశ్వనాథ్ ఆ తర్వాత వరుసగా చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, నేరము శిక్ష, శారద, జీవనజ్యోతి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథ్ ఓ కొత్త దిశను చూపారు. సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు తన విశ్వరూపం చూపారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలే సరైన మాధ్యమమని విశ్వనాథ్ భావించేవారు. ఇక తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇక శుభసంకల్పం చిత్రంతో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో 30 చిత్రాల వరకు నటించారు. కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన స్వాతిముత్యం(1985) చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్కి నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనతకెక్కింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం
దర్శకదిగ్గజం కాశీనాథుని విశ్వనాథ్ మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు తలసాని, పువ్వాడ,సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, ఏపీ సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ప్రముఖ నటులు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సంతాపం ప్రకటించారు.
అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. గతంలో కె.విశ్వనాథ్ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించానని, ఆ సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని కేసీఆర్ కొనియాడారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విశ్వనాథ్ మరణం తనను తీవ్ర విచారానికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ అని, ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయన్నారు. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని సీఎం జగన్ కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్ 31..వైరల్ అవుతోన్న అప్డేట్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహబంధంలోకి సిద్ధార్థ్ - అదితిరావు..?
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
రామ్ చరణ్ బర్త్డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు
విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడాయన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. -
తంగం కోసం జాన్వీ ఎదురుచూపు
‘దేవర’లో ఎన్టీఆర్కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది -
ముగింపు వరకూ కనిపెట్టలేం
‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా -
మరోసారి థ్రిల్లర్ కథలో!
నాగచైతన్య థ్రిల్లర్ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి -
మమ్మల్ని ఆపేదెవరు?
‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ -
నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టా
నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి. వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె. -
తెలుగులోకి ‘మంజుమ్మల్ బాయ్స్’
మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. చిదంబరం ఎస్ పొదువల్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది -
అంతా మనమే... ఇక నా మాటే
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు -
కెరీర్లో వరుసగా 16 ఫ్లాప్లు చూశా: అక్షయ్ కుమార్
తన కెరీర్లో వరుసగా 16 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ‘బడేమియా ఛోటేమియా’ ట్రైలర్ లాంచ్ వేడుకలో అక్షయ్ కుమార్ తెలిపారు. -
11 మంది హీరోలను పరిచయం చేయనున్న నిహారిక!
నిహారిక నిర్మిస్తోన్న ఓ సినిమాతో ఇండస్ట్రీకి 11 మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్.. మిర్నా హొయలు.. రాశీసింగ్ మెరుపులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
-
దిలీప్ ఘోష్కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
-
లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 22,100
-
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
-
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
-
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్