Liger: మరికొన్ని గంటల్లో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్‌ మీట్‌.. వేదిక మార్చేసిన టీమ్‌

‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఆదివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని..

Published : 14 Aug 2022 14:34 IST

హైదరాబాద్‌: ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఆదివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని తమ ఫ్యాన్స్‌ని మీట్‌ కానున్న విషయం తెలిసిందే. సాయంత్రం ఆరు గంటలకు వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ టూర్‌ జరగనుంది. అయితే, మరికొన్ని గంటల్లో ప్రోగ్రామ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా చిత్రబృందం ఆకస్మికంగా ఓ నిర్ణయం తీసుకుంది. మొదట అనుకున్న దాని ప్రకారం కాకుండా వేరే ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

‘‘భారీ వర్ష సూచన ఉండటంతో మీ సంరక్షణ దృష్టిలో ఉంచుకుని వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో జరగాల్సిన ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ మీట్‌ని కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించనున్నాం. సాయంత్రం ఐదు గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది’’ అని పేర్కొంటూ ఛార్మి ట్వీట్‌ చేశారు. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ నటి అనన్యాపాండే ఈ సినిమాతో తెలుగు వారికి చేరువ కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని