Vijay Deverakonda: సినిమా వేడుకలు రద్దైతే నేను ఆనందిస్తా: విజయ్ దేవరకొండ
భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘లైగర్’ ఈ గురువారం విడుదలకాబోతుంది. ప్రచారంతో చిత్ర బృందం ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుటికే పలు నగరాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని సందడి చేయగా ఇప్పుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘లైగర్’. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రమిది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ గురువారం విడుదలకాబోతుంది. ఇప్పుటికే పలు నగరాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని సందడి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తళుక్కుమంది. సుమ హోస్ట్గా వ్యవహరించిన ఈ చిట్చాట్లో హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండే, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, నటుడు విష్ణురెడ్డి పాల్గొని, పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
‘‘హైదరాబాద్ నుంచే ఈ సినిమా ప్రచారాన్ని మొదలుపెట్టాం. ట్రైలర్ విడుదలకు వచ్చిన అభిమానగణాన్ని చూసి షాక్ అయ్యా. ఇదే అభిమానం ఇతర నగరాల్లో కనిపిస్తుందా, లేదా? మన చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలి? అని టెన్షన్ పడ్డా. కానీ, ముంబయి సహా ఇతర సిటీల్లో ఎంతోమంది మమ్మల్ని చూసేందుకు వచ్చారు. ఆ జనసందోహాన్ని చూశాక ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. ఒకప్పుడు నేను నటుణ్ణి కాగలనా? అనే సందేహం ఉండేది. అలాంటిది ఇప్పుడు నాపై ఇంతమంది ప్రేమను కురిపిస్తుంటే మాటలు రావట్లేదు. వేదికలపై డ్యాన్స్ చేయడమంటే నాకు నచ్చదు. అందుకే కొన్ని సార్లు ఈవెంట్లు క్యాన్సిల్ అయితే ఆనందిస్తా (నవ్వుతూ..). ‘లైగర్’ తర్వాత నాలో చాలా మార్పులొచ్చాయి’’ అని విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు.
‘‘ఇతర సినిమాల ట్రైలర్లలో కథనే ఎడిట్ చేసి చూపిస్తున్నారు. అందుకే మేం మా ట్రైలర్లో స్టోరీ గురించి చెప్పకుండా కొత్తగా ప్రయత్నించాం. ఈ సినిమాలోని కథానాయకుడిది కరీంనగర్. వాళ్లమ్మ తన కొడుకుని నేషనల్ ఛాంపియన్గా చూడాలనుకుంటుంది. అలా హీరో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో మెరుస్తాడు. అతను అక్కడికి చేరుకునేందుకు ఎంత కష్టపడ్డాడు? తన ప్రేమ వ్యవహారం ఏంటి? మైక్ టైసన్ ఎందుకు వచ్చాడు? అనేది లైగర్ కథ. ప్రధానంగా లవ్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఈ సినిమా గురించి చెప్పేందుకు సింపుల్గానే ఉంటుంది కానీ పాత్రల తీరు తెన్నులు వివరించటం, తెరకెక్కించటం చాలా కష్టం’’ అని పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వెల్లడించారు.
‘‘ముందుగా ఈ చిత్రానికి ఫైటర్ అనే పేరు పెట్టాలనుకున్నాం. కానీ, రొటీన్గా ఉంటుందని ఖరారు చేయలేదు. కొన్ని రోజుల తర్వాత, ‘లైగర్’ అని పెడితే ఎలా ఉంటుంది? అని పూరి జగన్నాథ్ అడిగారు. దానర్థం తెలియగానే ‘ఇది కదా టైటిల్ అంటే’ అని అనిపించింది. నిర్మాత కరణ్ జోహార్, విజయ్ దేవరకొండకి ఈ టైటిల్ అనుకుంటున్నామని చెప్పగానే ఇద్దరూ అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రచారం ప్రారంభించిన సమయంలో విజయ్కి జ్వరం వచ్చింది. నాకు ఫోన్ చేసి ‘ఛార్మీ.. రూమ్లో ఉండటం నా వల్ల కావట్లేదు. త్వరగా ప్రమోషన్ ప్రారంభిద్దాం’ అని అనేవాడు. మైక్ టైసన్కి భారతీయ వంటకాలంటే మహా ఇష్టం’’ అని ఛార్మి (Charmy Kaur) తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు