ఆ యువ జంట మధ్య ఏం జరిగింది?

బాలీవుడ్‌ దూకుడు పెంచింది. వరుసగా  చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శక-నిర్మాతలు. తాజాగా

Published : 10 Mar 2021 12:58 IST

ముంబయి: బాలీవుడ్‌ దూకుడు పెంచింది. వరుసగా  చిత్రాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శక-నిర్మాతలు. తాజాగా ‘లూప్‌ లపేటా’ చిత్రాన్ని అక్టోబరు 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం.

తాప్సి, తాహిర్‌ రాజ్‌ భాసిన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సావి, సత్య అనే ఓ యువ జంట మధ్య జరిగే కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఆకాష్‌ భాటియా దర్శకత్వంలో కామిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.  వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న తాప్సి ఈ చిత్రంలోని పాత్రా తనకు మంచి పేరు తెస్తుందని ధీమాగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని