సామ్‌ చూస్తుందంటూ టెన్షన్‌ పడిన చైతూ! 

టీవీని ఇంట్లో అందరూ చూస్తారు. సామ్‌ కూడా చూస్తుంది’ అంటూ రానా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సందడి చేశారు నాగ చైతన్య.

Published : 08 Apr 2021 17:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘టీవీని ఇంట్లో అందరూ చూస్తారు. సామ్‌ కూడా చూస్తుంది’ అంటూ రానా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సందడి చేశారు నాగ చైతన్య. ఆయన హీరోగా నటించిన ‘లవ్‌ స్టోరీ’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల, నాయిక సాయి పల్లవిలతో కలిసి ఆహాలో ప్రసారమయ్యే ‘నంబరు 1 యారి’ కార్యక్రమానికి విచ్చేశారు చైతన్య. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో ‘శేఖర్‌ కమ్ముల గారి సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?’ అని రానా అడగ్గా  సెలబ్రిటీ క్రషా అంటూ చైతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌ ఆకట్టుకుంటుంది. మరో ప్రశ్నగా ‘సింగిల్ ఉన్నప్పుడు ఏవేం మిస్‌ అయ్యావ్‌’ అని అడిగితే చాలా ఉన్నాయి.. టీవీని ఇంట్లో అందరూ చూస్తారు. సామ్‌ కూడా చూస్తుంది అంటూ కాస్త టెన్షన్‌ పడుతూ నవ్వులు పూయిస్తున్నారు చైతన్య. మరి శేఖర్‌ కమ్ముల క్రష్‌, చైతూ బ్యాచిలర్‌గా ఏం మిస్‌ అయ్యాడు తెలుసుకోవాలంటే ఏప్రిల్‌ 11 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి... 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని