‘లూసిఫర్’ ముచ్చట దసరాకు చెబుతారా?
ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తారని చిరు గతంలో చెప్పారు. అయితే అతని స్థానంలో సీనియర్ వి.వి.వినాయక్
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కథానాయకుడు చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తారని చిరు గతంలో చెప్పారు. అయితే అతని స్థానంలో సీనియర్ వి.వి.వినాయక్ వచ్చారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా... ఇప్పటికే వినాయక్ సినిమా కథ విషయంలో తనదైన శైలిలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో చిరు-వినాయక్ కలసి కూర్చొని స్క్రిప్ట్ ఫైనల్ చేస్తారని తాజా సమాచారం.
చిరంజీవితో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెం.150’ లాంటి హిట్ సినిమాలు ఇచ్చిన వినాయక్... ఇప్పుడు మూడోసారి జట్టుకట్టబోతున్నారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరా నాటికి సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వస్తుందని తెలుస్తోంది. మాతృక నుంచి కథను మాత్రమే తీసుకొని దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో కథానాయకుడి సోదరి పాత్ర చాలా కీలకం. ఈ పాత్ర కోసం ఖుష్బూ, సుహాసిని, రమ్యకృష్ణ పేర్లను పరిశీలించారు. దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడిన చిత్రీకరణను త్వరలో మొదలుపెడతారని తెలుస్తోంది. ఇందుకోసం నగరంలో ఓ సెట్ తీర్చిదిద్దారు. ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్తో పాటు బాబి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..