Cinema News: నవ్వులు పంచే ‘లక్కీ లక్ష్మణ్’
సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్.అభి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ
సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్.అభి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టగా.. సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర సంయుక్తంగా దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. నిర్మాత అప్పిరెడ్డి మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం హీరో సోహైల్ మాట్లాడుతూ.. ‘‘టెక్నికల్, ఔట్పుట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మంచి టీమ్తో ఈ సినిమా నిర్మిస్తున్నార’’న్నారు. ‘‘చుట్టూ ఉన్న వారంతా ‘నువ్వు లక్కీఫెలో’ అంటున్నా.. తాను మాత్రం అన్ లక్కీ అని ఫీలయ్యే యువకుడి కథగా సాగుతుంది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో ఆండ్రూ, మోక్ష పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..