Chandrabose: సాహిత్యానికే కాదు.. సహనానికీ లభించిన పురస్కారం!
Chandrabose: భావాల పుట్ట... చంద్రబోస్. భావోద్వేగాలు పలికించడంలో చేయి తిరిగిన పాటకాడు ఆయన. వేల పాటలతో... రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ శ్రోతల్ని అలరిస్తున్న అలుపెరగని పాటసారి.
చంద్రబోస్
భావాల పుట్ట... చంద్రబోస్ (Chandrabose). భావోద్వేగాలు పలికించడంలో చేయి తిరిగిన పాటకాడు ఆయన. వేల పాటలతో... రెండున్నర దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూ శ్రోతల్ని అలరిస్తున్న అలుపెరగని పాటసారి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు.. పాటతో ఆయన పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోయింది. ఈ పాట రచనకి ఆస్కార్ అందుకున్న ఉద్విగ్న క్షణాల తర్వాత చంద్రబోస్ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఆస్కార్ వేదికెక్కినప్పుడు మీలో కలిగిన అనుభూతి ఎలాంటిది?
భారతదేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని చేతిలో నిలుపుకున్నట్టుగా అనిపించింది. ఆ క్షణాలు అనిర్వచనీయమైన అనుభూతిని పంచాయి. గోల్డెన్ గ్లోబ్తోపాటు ఇతర అంతర్జాతీయ పురస్కారాలు వచ్చినప్పుడే ఆస్కార్ కూడా ఖాయం అనే ఓ భరోసా ఉండేది. అది సాకారమైన ఆ క్షణాలు భావోద్వేగానికి గురిచేశాయి.
ఇదివరకెప్పుడైనా ఆస్కార్ గురించి కలలుగనేవారా?
ఆస్కార్ ఆలోచన లేదు కానీ... జాతీయ పురస్కారం గురించైతే చాలా కలలుగన్నాను. ఒక్కసారైనా జాతీయ పురస్కారం అందుకోవాలనేది నా జీవిత లక్ష్యం, స్వప్నంగా ఉండేది. అది నెరవేరకముందే నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్తో పాటు ఆస్కార్ పురస్కారాలు లభించాయి.
ఇదివరకు కూడా ఎన్నో గొప్ప పాటలు రాశారు. నాటు నాటు..’ పాటకి ఆస్కార్ దక్కడంపై మీ అభిప్రాయం?
ఈసారి సాహిత్యంతోపాటు సహనానికి కూడా లభించిన పురస్కారంగా భావిస్తా. నా 27 ఏళ్ల రచనా ప్రయాణంలో ఒక పాటని 19 నెలలు రాసిన సందర్భం ఒక్కటీ లేదు. ఏ పాటైనా నాలుగైదు రోజుల్లో పూర్తవ్వాలి. మహా అంటే ఒక నెల. ‘నాటు నాటు...’ పాట పూర్తి కావడానికి మాత్రం 19 నెలలు పట్టింది. సహనాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పదం పేర్చుకుంటూ, కూర్చుకుంటూ రాశా. అందుకే సాహిత్యంతోపాటు, ఆ సహనానికి కూడా అదనంగా మార్కులు పడి ఈ పురస్కారం లభించిందని భావిస్తా.
తెలుగు సాహిత్యానిది ఆస్కార్ స్థాయి అని రుజువైంది. ఒక కవిగా భాష గురించి ఏం చెబుతారు?
భారతీయ సినిమాల్లోని సందర్భాలు, సన్నివేశాలు, ఆ భావోద్వేగాలు మరెక్కడా ఉండవేమో అనిపిస్తుంది. మన సినిమాల్లో అన్నన్ని రకాల పాటలు ఉంటాయంటే కారణం అదే. తెలుగులోనే తీసుకుంటే నేనే ఎన్నెన్ని సందర్భాలకి పాటలు రాశాననీ! స్ఫూర్తి, ప్రేరణ, భక్తి, ప్రేమ, విరహం, ఎడబాటు, శృంగారం, అల్లరి, భాష, కట్టూ బొట్టు, తమాషా, సరదా... ఇలా ఎన్ని సందర్భాలు ఉంటాయో అన్నిటికీ రాశా. మనం ఆ స్థాయికి చేరుకోవడానికి, ఆ మార్గం ఒకటి ఉంటుందని తెలుసుకుని పట్టుకోవడానికి సమయం పట్టింది కానీ... మన సాహిత్యంలో కానీ, సందర్భాల్లో, భావాల్లో పరిపుష్టి లేక కాదు.
అంతర్జాతీయ స్థాయి భావాలు ఎక్కువగా మన చిత్రాల్లోనే ఉంటాయి. మన పాటని అక్కడికి తీసుకెళ్లగలిగే మార్గం కావాలి, ఒక మార్గదర్శి కావాలి. అప్పుడే అన్నీ సాధ్యం అవుతాయి. ‘RRR’ చిత్రానికి నిజంగా అది సాధ్యమైంది. దర్శకుడు రాజమౌళి వల్ల ‘నాటు నాటు’ పాట అంతవరకు వెళ్లింది. మన పూర్వీకులు, నా సమకాలీకులు గొప్ప గొప్ప సందర్భాలకి, గొప్ప పాటలు రాశారు. గొప్ప సాహిత్య పరమైన, సంగీత పరమైన భాష మనదని ఆస్కార్ వేడుకలోనూ చెప్పా.
ఆస్కార్ పురస్కార విజేతగా ఆ ప్రభావం మీపైన, మీ రచనా ప్రస్థానంపైన ఏ రకంగా ఉంటుందని భావిస్తున్నారు?
ఆస్కార్ బరువు మూడున్నర కేజీలు, గోల్డెన్ గ్లోబ్ ఏడు కేజీలు, క్రిటిక్స్ ఛాయిస్ బరువు ఆరు కేజీలు. ఇప్పుడు నాపైన అదనంగా మరో 20, 30 కేజీల బరువు పడిపోయింది (నవ్వుతూ). అందుకే ఇంకా జాగ్రత్తగా అడుగులేస్తూ రాయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!