RamaJogaiah Sastry: మీకు ఇబ్బంది ఉంటే ఇటు రాకండి.. రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ వైరల్‌

ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 25 Nov 2022 15:52 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరోలకు హిట్‌ పాటలు అందించిన ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘ప్రతి పాట ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి నన్ను గౌరవంగా చూడగలిగిన వారు మాత్రమే నాతో ప్రయాణించండి. జన్మనిచ్చిన అమ్మగారి గౌరవార్థం నా పేరును సరస్వతీ పుత్ర రామజోగయ్యశాస్త్రిగా మార్చుకున్నాను. ఈ విషయంపై వేరే వాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే ఇటు రాకండి’’ అని ఆయన రాసుకొచ్చారు.

రామజోగయ్య శాస్త్రి ఉన్నట్టుండి ఈ విధంగా ట్వీట్‌ పెట్టడానికి గల కారణం ఏమిటో తెలియదు. ‘వీర సింహారెడ్డి’ సినిమా కోసం ఆయన రాసిన ‘జై బాలయ్య’ పాట విడుదలైన కొంతసేపటికే ఈ ట్వీట్‌ చేశారు. ఈ పాట విడుదలయ్యాక పలువురు సోషల్‌మీడియా యూజర్స్‌ నెగెటివ్‌గా కామెంట్స్‌ చేశారని.. అందుకే ఆయన ఈ ట్వీట్‌ పెట్టారని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ‘‘జై బాలయ్య’ పాట చాలా బాగుంది. సాహిత్యంపై పట్టులేని వాళ్లు చేసే వ్యాఖ్యలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ మరికొంతమంది తమ మద్దతు తెలియజేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని