Naresh: శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదు: నరేశ్
సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నరేశ్ తప్పుపట్టారు.
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నటుడు నరేశ్ తప్పుపట్టారు. సాయితేజ్ విషయంలో తాను విడుదల చేసిన వీడియో బైట్ మీడియాలో తప్పుగా ప్రసారం కావడం వల్ల పెద్దలు మందలించారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు. తన ముందే హీరోగా ఎదిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్... మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తూ తమ ప్యానల్ ముందు ఓడిపోయారని తెలిపారు. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్న తాను ఎలాంటి వివాదాలు, విమర్శలకు తావులేకుండా మాట్లాడతానని నరేశ్ స్పష్టం చేశారు. శ్రీకాంత్ మరోసారి వీడియోలు విడుదల చేసేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు. యుక్త వయస్సులో వచ్చిన వాళ్లకు ద్విచక్రవాహనాలు నడపడం సహజమని, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా సహజమని నరేశ్ వ్యాఖ్యానించారు. సాయితేజ్ స్పీడ్గా వెళ్లలేదని, జారిపడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మరోమారు తెలిపారు.
అసలు ఏం జరిగింది?
సాయిధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత నటుడు నరేశ్ స్పందించారు. తన ఇంటి నుంచే సాయితేజ్ బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెళ్లి కలవలేకపోయానని, ఇంటికి వచ్చాక వెళ్లి కలుస్తానని చెప్పారు. ‘గతంలో కూడా కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, కోమటిరెడ్డిగారి కుమారులు ఇలాగే ప్రమాదాలకు గురై, కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచెత్తి వెళ్లారు. రానున్న రోజుల్లో బైక్లు ముట్టుకోకుండా చేయాలి’ అని నరేశ్ అన్నారు. నరేశ్ అలా మాట్లాడటం సినీ పరిశ్రమలోని కొందరిని బాధించింది. ఈ క్రమంలోనే సాయితేజ్ ప్రమాదం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నరేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
‘‘సాయిధరమ్ తేజ్కు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నాకు తెలిసి, ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న యువ కథానాయకుల్లో పరిణతి కలిగిన వ్యక్తుల్లో సాయితేజ్ ఒకరు. అతను వాహనాన్ని వేగంగా నడిపే వ్యక్తి మాత్రం కాదు. ప్రమాదం గురించి చాలా మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వీడియోలు విడుదల చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని పెట్టండి. ఎందుకంటే ప్రమాదం జరిగిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. నరేశ్ చనిపోయిన వారి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదనిపించింది’’ అని శ్రీకాంత్ అనడంతో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్