ఒకేసారి ఐదు భాషల్లో ‘మానాడు’ టీజర్‌

మన్మథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శింబు. వినూత్నమైన సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ తమిళ స్టార్‌హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌

Published : 04 Feb 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మన్మథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శింబు. వినూత్నమైన సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ తమిళ స్టార్‌హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు శింబు జన్మదినం సందర్భంగా సినిమా టీజర్‌ను ఒకేసారి ఐదు భాషల్లో ఐదుగురు సినీ ప్రముఖులతో విడుదల చేయించారు. తెలుగులో మాస్‌ మహారాజ్‌ రవితేజ స్వయంగా ఈ టీజర్‌ను విడుదల చేశారు. తమిళంలో ఎ.ఆర్‌.రెహమాన్‌, కన్నడలో స్టార్‌హీరో సుదీప్‌, హిందీలో ప్రముఖ దర్శకుడు అనురాగ్‌కాశ్యప్‌, మళయాళం టీజర్‌ను పృథ్వీరాజ్‌ విడుదల చేశారు.

పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శింబు ఓ ముస్లిం యువకుడిగా కనిపించనున్నాడు.  ఈ సినిమా శింబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. సురేశ్‌ కామాచి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శింబుకి జోడీగా ‘చిత్రలహరి’ ఫేమ్‌ కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

ఇదీ చదవండి..

ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎలా తప్పించుకున్నాడు..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని