మాధవన్‌కు కరోనా.. ఫన్నీ ట్వీట్‌

కరోనా విజృంభిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నిన్న బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో నటుడు మాధవన్‌ కూడా కరోనాకు గురయ్యారు.

Published : 25 Mar 2021 23:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విజృంభిస్తున్న తరుణంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నిన్న బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో నటుడు మాధవన్‌ కూడా కరోనాకు గురయ్యారు. అయితే.. అందరిలా కాకుండా ఈ విషయాన్ని మాధవన్‌ కాస్త భిన్నమైన రీతిలో అభిమానులతో పంచుకున్నారు. తాను నటించిన ‘త్రీఇడియట్స్‌’ సినిమాను ప్రస్తావిస్తూ ఒక ఫన్నీ ట్వీట్‌ చేశారు.

2009లో వచ్చిన బాలీవుడ్‌ హిట్‌ చిత్రం ‘త్రీఇడియట్స్‌’ గుర్తుందిగా. రాజ్‌కుమార్‌ హిరాణి తెరకెక్కించిన ఆ సినిమాలో ఆమిర్‌ఖాన్‌, మాధవన్‌ కలిసి నటించారు. రాంచో పాత్రలో ఆమిర్‌ఖాన్‌, ఫర్హాన్‌గా మాధవన్‌ కనిపించారు. ఆ సినిమాలో వాళ్లు చదివే కళాశాల ప్రిన్సిపల్‌ను సరదాగా వైరస్‌ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇదంతా ఇలా ఉండగా.. ఆ చిత్రంలో నటించిన ఆమిర్‌ఖాన్‌, మాధవన్‌ ఇద్దరూ 24గంటల వ్యవధిలో కరోనాకు గురయ్యారు. దీంతో మాధవన్‌ కరోనా సోకిన విషయాన్ని ట్విటర్‌లో పంచుకొంటూ ఇలా రాసుకొచ్చారు. ‘‘రాంచోను ఫర్హాన్‌ అనురించాల్సిందే. వైరస్‌ కూడా మనతోనే ఉన్నాడు. కానీ.. ఈ వైరస్‌ కాస్త ప్రమాదకరం. ఏదేమైనా ఆల్‌ ఈజ్‌ వెల్(సినిమాలో ఫేమస్‌ అయిన డైలాగ్‌)‌. ఇందులోకి రాజు(ఆ సినిమాలో మూడో పాత్ర) రాకూడదని కోరుకుందాం. నేను వేగంగా కోలుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అని మాధవన్‌ పేర్కొన్నాడు. ఆ చిత్రం నుంచి ఒక పోస్టర్‌ను ట్వీట్‌లో పంచుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని