‘సలార్‌’ విలన్‌ ఫిక్స్‌

పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా...

Published : 07 Feb 2021 10:05 IST

సోషల్‌మీడియాలో నటుడి పోస్ట్‌

హైదరాబాద్‌: పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయంలో గత కొన్నిరోజులుగా పలువురు నటుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాను ‘సలార్‌’లో నటిస్తున్నానని పేర్కొంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్‌మీడియాలో ఇటీవల పోస్ట్‌ పెట్టారు.

‘నా తదుపరి ప్రాజెక్ట్‌ ‘సలార్‌’. నాకెంతో ఆనందాన్ని అందిస్తున్న ఈ విషయం గురించి మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘సలార్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నాను. నాకు ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్, నిర్మాత, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలు’ అని ఆయన పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో మధూ గురుస్వామి.. ‘సలార్‌’లో విలన్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో ప్రభాస్‌-శ్రుతిహాసన్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదీ చదవండి

‘ఉప్పెన’ మరో ‘రంగస్థలం’

పదిహేడేళ్ల తర్వాత ఆ నటి వస్తోందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని