భావోద్వేగాల ‘జెర్సీ’.. సందేశాత్మక ‘మహర్షి’
జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరో మూడు పురస్కారాలను కైవసం చేసుకొని ఔరా అనిపించాయి. 2019కి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది.
సత్తా చాటిన తెలుగు చిత్రాలు
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు మరో మూడు పురస్కారాలను కైవసం చేసుకొని ఔరా అనిపించాయి. 2019 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సోమవారం ప్రకటించింది. అందులో సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన ‘మహర్షి’, నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ ఉన్నాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫర్ విభాగాల్లో మహర్షి పురస్కారాలు సొంతం చేసుకుంది. ఉత్తమ తెలుగు భాష చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో జెర్సీ అవార్డులు గెలుచుకుంది. మరి ఇంతకీ ఆ సినిమాలు జాతీయ స్థాయిలో అవార్డులు పొందడానికి గల కారణాలేంటో ఓసారి చూద్దాం..
అసలైన నివాళి ‘జెర్సీ’
మన దేశంలో క్రికెట్.. సినిమా.. ఎంతో ఎమోషన్తో కూడుకున్న పదాలు. ఇక ఈ రెండింటినీ ఒకచోట కలిపితే ఎమోషన్ తారస్థాయికి చేరుతుంది. అదే చేశారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి-యువ కథానాయకుడు నాని. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రంజీ క్రికెటర్ రమణ్ లాంబ జీవితాన్ని ప్రేరణగా తీసుకుని దీన్ని తెరకెక్కించారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. 2019 ఏప్రిల్ 19న వచ్చిన ఈ చిత్రం.. అభిమానుల హృదయాలను తాకింది. బాలీవుడ్లోనూ ఈ సినిమా రీమేక్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా నిలిచింది.
నవీన్ నూలి
ఎప్పటికైనా భారత జట్టుకు క్రికెట్ ఆడాలని కలలుకంటుంటాడు హీరో (అర్జున్). కొన్ని అనివార్య కారణాల వల్ల క్రికెట్ను మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. తర్వాత పెళ్లి.. కొంతకాలానికి ఒక కుమారుడు.. ఇలా జీవితం సాధారణంగా సాగిపోతూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కూడా పోతుంది. ఈ క్రమంలోనే ఒకసారి తన కుమారుడు.. టీమ్ ఇండియా ‘జెర్సీ’ కావాలని అడుగుతాడు. కన్న కొడుకు కోసం కనీసం జెర్సీ కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నానని గ్రహించి.. తనను తానే అసహ్యించుకుంటాడు అర్జున్. తన కొడుకు కోసమైనా మళ్లీ క్రికెటర్గా మారాలని నిర్ణయించుకుంటాడు. క్రికెట్ మైదానంలో అడుగుపెడతాడు. 36 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటమేంటని ఎన్నో ఎత్తి పొడుపులు.. అవమానాలు. అన్నింటినీ మౌనంగా దిగమింగుతూ.. హీరో తన కలవైపు ఎలా ప్రయాణించాడన్నదే కథ. ‘నువ్వు క్రికెట్ ఆడితే హీరోలా అనిపిస్తావు నాన్న’ అంటూ సాగే డైలాగ్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా జెర్సీ అనగానే గుర్తొచ్చేది రైల్వే స్టేషన్ సీన్. ఆ సన్నివేశంలో నానిని తప్ప మరెవర్నీ ఊహించుకోలేం. ఈ సినిమాలో నాని నటన, డైరెక్టర్ పనితీరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయనడంలో సందేహం లేదు.
జెర్సీకి వచ్చిన అవార్డులు..
జీ తెలుగు సినీ అవార్డు - ఫేవరెట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ - నాని
జీ తెలుగు సినీ అవార్డు - ఉత్తమ హీరోయిన్ - శ్రద్ధ
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ - ఉత్తమ డైరెక్టర్ - గౌతమ్ తిన్ననూరి
క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ - ఉత్తమ నటుడు - నాని
జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు చిత్రం - జెర్సీ
జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి
సక్సెస్కు అసలైన అర్థం ‘మహర్షి’
‘రైతు’ సెంటిమెంట్కు కనెక్ట్ కాని ప్రేక్షకులుంటారా..? రైతును తెరపై చూపిస్తే.. థియేటర్లో ఆటోమేటిక్గా ఎమోషన్ పండుతుంది. దానికి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ వచ్చిందే ‘మహర్షి’. సక్సెస్కు అసలైన అర్థం చెప్పిన ఈ సినిమాలో మహేశ్బాబు, పూజా హెగ్డే జంటగా.. అల్లరి నరేశ్ ప్రధానపాత్రలో నటించారు. వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మే 9న విడుదలైన ఈ చిత్రం కథ.. పాటలు.. డ్యాన్స్.. ఇలా అన్నింట్లోనూ ప్రేక్షకులను అలరించింది. మహేశ్బాబు కెరీర్లో ఓ మంచి సందేశాత్మక చిత్రంగా నిలిచింది.
రాజు సుందరం
జీవితంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండే ఓ మధ్య తరగతికి చెందిన యువకుడు రిషి కుమార్ (హీరో). అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన ఆరిజిన్కు సీఈఓ అవుతాడు. సక్సెస్కు ఫుల్స్టాప్ ఉండదనేది రిషి సిద్ధాంతం. ఈ క్రమంలోనే తన సక్సెస్ కోసం తల్లిదండ్రులను, స్నేహితులను దూరం చేసుకుంటాడు. చివరికి.. తన సక్సెస్ వెనుక తన స్నేహితుడు రవి (అ్లలరి నరేశ్) త్యాగం ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత.. తన స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని రవిని అమెరికా తీసుకువెళ్లడం కోసం స్వదేశానికి వస్తాడు. ఈ క్రమంలోనే ఆ సమస్య తన స్నేహితుడిది మాత్రమే కాదు.. ఒక గ్రామం మొత్తానిది అని గ్రహిస్తాడు. అలా.. ఆ గ్రామం కోసం హీరో ఎలా పోరాడాడన్నదే కథ. ఈ సినిమాలో డైరెక్టర్ వంశీ.. మహేశ్ను విద్యార్థిగా, ఉద్యోగిగా, రైతుగా చూపించడంలో సఫలమయ్యారు. ‘శ్రీమంతుడు’ తర్వాత మరోసారి అదే తరహాలో వచ్చిన ‘మహర్షి’ ఆకట్టుకుందంటే.. హీరో మహేశ్, డైరెక్టర్ వంశీతో పాటు చిత్రబృందం విశేష శ్రమ దాగి ఉంది. రైతు అంటే సానుభూతి కాదు.. రైతు అంటే గౌరవం అని నిరూపించిందీ చిత్రం.
మహర్షికి వచ్చిన అవార్డులు..
జీ తెలుగు సినీ అవార్డు - ఉత్తమ సహాయ నటుడు - నరేశ్
జీ తెలుగు సినీ అవార్డు - ఉత్తమ నటి - పూజ హెగ్డే
జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ వినోదాత్మక చిత్రం - మహర్షి
జాతీయ చిత్ర పురస్కారాలు - ఉత్తమ కొరియోగ్రఫీ - రాజు సుందరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.