Sarkaru Vaari Paata: ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి.. పరశురామ్ ప్రత్యేకత అదే: మహేశ్బాబు
చాలాకాలం తర్వాత మహేశ్బాబు సరికొత్త లుక్లో, యాక్షన్ నేపథ్యంలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్ కథానాయిక. పరశురామ్ దర్శకుడు.
ఇంటర్నెట్ డెస్క్: చాలాకాలం తర్వాత మహేశ్బాబు సరికొత్త లుక్లో, యాక్షన్ నేపథ్యంలో నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్ కథానాయిక. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైనర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మహేశ్ విలేకరులతో మాట్లాడారు. పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సంగతులివీ..
* ఈ సినిమాలో మీరింత కొత్తగా కనిపించడానికి కారణం?
ఈ సినిమాకు సంబంధించిన అన్ని అంశాల్లో దర్శకుడు పరశురామ్కే క్రెడిట్ దక్కుతుంది. కథానాయకుడి పాత్రే కాదు కథను ఎంతో అద్భుతంగా రూపొందించారాయన. ఇందులో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటుంది. వీటిని చూసి నాకు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి. ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ పూర్తయిన సమయానికి నా జుట్టు పొడవుగా లేదు. కానీ, అప్పుడున్న జుట్టుతోనే మెడపై టాటూ వేసి ‘సర్కారు వారి’ లుక్ ఇలా ఉంటుందని చూపించారు. దాన్ని చూడగానే వావ్ అనిపించింది. అది పూర్తయిన కొంతకాలానికి లుక్పై శ్రద్ధ తీసుకున్నా.
* ఈ సినిమాను ‘పోకిరి’తో పోలుస్తున్నారెందుకు?
‘సర్కారు వారి పాట’లోని హీరో క్యారెక్టర్ ‘పోకిరి’ మీటర్లోనే ఉంటుంది. అందుకే చాలామందికి అలా అనిపిస్తుంది. మాస్ చిత్రం ‘పోకిరి’ని చూస్తుంటే ఇప్పటికీ ఎంతో హుషారొస్తుంది. అలాంటి పాత్ర ఇన్నాళ్లకు లభించడం ఆనందంగా ఉంది.
* ‘మేజర్’ ట్రైలర్ విడుదల వేడుకలో నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా బ్లాక్ బస్టర్ అని అన్నారు కదా!
నేను ఎంపిక చేసుకున్న కథలు, నా అనుభవంతోనే ఆ మాట చెప్పా. నాలుగేళ్లుగా నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. నా గత చిత్రాల్లానే ‘సర్కారు..’ మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది.
* మీరు చాలా మంది దర్శకులతో పని చేశారు. పరశురామ్ ప్రత్యేకత ఏంటి?
పరాశురామ్ రచనా విధానం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అదే ఆయన ప్రత్యేకత. ఎప్పుడూ ఎంతో పాజిటివ్గా ఉంటారు. ఆయన తెరకెక్కించిన ‘గీత గోవిందం’ నాకు ఇష్టమైన సినిమాల్లో ఒకటి.
* ఈ కథ యూఎస్ నేపథ్యంలో సాగుతుందా?
ప్రధమార్థం యూఎస్, ద్వితీయార్థం విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది.
* ‘మ మ మహేషా’ పాటను విశ్రాంతి తీసుకోకుండా పూర్తి చేశారట?
అలాంటిదేం లేదు. ముందుగా వేరే పాట పెట్టాలని భావించాం కానీ సందర్భానికి తగ్గట్టు ఉండదని దాన్ని తీసేశాం. తర్వాత, చిత్ర బృందమంతా చర్చించుకుని మాస్ సాంగ్ అయితే చాలా బావుంటుందనే నిర్ణయానికొచ్చాం. అలా తమన్ ‘మ మ మహేషా..’ ట్యూన్ వినిపించాడు. వినగానే జోష్ వచ్చేసింది. చిత్రీకరణ కోసం పది రోజుల్లో భారీ సెట్ రూపొందించాం. ఈ పాట సినిమాకే హైలెట్గా నిలుస్తుంది.
* సినిమా ఓసారి వాయిదా పడింది. ఈ విరామంలో మార్పులు ఏమైనా చేశారా?
ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రారంభంలో ఏం అనుకున్నామో దాన్నే మీ ముందుకు తీసుకొస్తున్నాం.
* ఈ చిత్రంలో సందేశం ఏమైనా ఉంటుందా?
‘గత మూడు సినిమాల్లో మెసేజ్ బాగా రుద్దారు. అలాంటివేం లేకుండా మహేశ్ బాబుని చూడటం చాలా బావుంది’ అని ‘సర్కారు వారి’ ట్రైలర్కు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇందులో సందేశం ఉండదు.
* సంగీత దర్శకుడు తమన్ గురించి ?
తమన్ మ్యూజికల్ సెన్సేషన్. ‘కళావతి’ పాట నా కెరీర్ లోనే ది బెస్ట్గా నిలిచింది. ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని మేం అనుకోలేదు. తమన్ ఒక్కడే ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. తను అనుకున్నదే నిజమైంది. పాటలే కాదు నేపథ్య సంగీతం అదరగొట్టాడు.
* మీ తదుపరి సినిమా విషయంలో పాన్ ఇండియా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
‘సర్కారు వారి’ విషయంలో నా దృష్టంతా తెలుగు వెర్షన్పైనే ఉంది. ముందు నుంచీ తెలుగులోనే తీద్దామని ఫిక్స్ అయ్యాం. తెలుగు సినిమానే బాలీవుడ్కీ చేరాలని కోరుకుంటున్నా. తదుపరి ప్రాజెక్టు విషయానికొస్తే.. నేనూ రాజమౌళి కలిస్తే పాన్ ఇండియా కాకుండా ఎలా ఉంటుంది.
* చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది ?
సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్టు శ్రమిస్తాం. ఆయన రాసిన డైలాగ్ నేను చెప్తుంటే ఆ కిక్కే వేరు. మీలానే నేనూ ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా.
* మీ పిల్లలు నట వారసులుగా వస్తారా?
నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. సితార తనకు నచ్చింది చేస్తుంటుంది. గౌతమ్కు చదువు అంటే ఆసక్తి. వారి ఇష్టాలను నేను గౌరవిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు