Mahesh Babu: తీవ్ర విషాదంలో మహేశ్‌బాబు.. ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయి

మహేశ్‌బాబు కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురు చనిపోవడం విషాదకరం. 

Updated : 15 Nov 2022 16:49 IST

హైదరాబాద్‌: మనకు బాగా కావాల్సిన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. కన్నవారు, తోబుట్టువులు తిరిగిరాని లోకాలకు వెళ్లడం మాటలకందని విషాదం. అలాంటిది నెలల వ్యవధిలోనే ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Maheshbabu). తన సోదరుడు రమేశ్‌బాబుని పోగొట్టుకున్న బాధలో ఉన్న మహేశ్‌ కోలుకునేలోపే ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోయారు. ఆ బాధ నుంచి తేరుకునేలోపు తండ్రి కృష్ణ మరణం ఆయన్ను మళ్లీ విషాదంలోకి నెట్టేసింది.

ఈ కష్టకాలంలో మహేశ్‌కు శక్తినివ్వాలంటూ అభిమానులు దైవాన్ని ప్రార్థిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు ధైర్యాన్నిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 8న మహేశ్‌ సోదరుడు రమేశ్‌బాబు (నటుడు, నిర్మాత) కాలేయ సంబంధిత వ్యాధితో మరణించగా, ఆయన తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యతో సెప్టెంబరు 28న కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ (Krishna).. మహేశ్‌కు దూరమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని