Mahesh Babu: బాలీవుడ్‌ నన్ను భరించలేదు.. నా సమయం వృథా చేసుకోను: మహేశ్‌బాబు

‘‘బాలీవుడ్‌ నన్ను భరించలేదు’’ అంటూ కామెంట్స్‌ చేశారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన నటించిన ‘సర్కారువారి పాట’తోపాటు నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’...

Published : 11 May 2022 10:34 IST

హైదరాబాద్‌: ‘‘బాలీవుడ్‌ నన్ను భరించలేదు’’ అంటూ కామెంట్స్‌ చేశారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన నటించిన ‘సర్కారువారి పాట’తోపాటు నిర్మాతగా వ్యవహరించిన ‘మేజర్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఆయన జాతీయ, స్థానిక ఛానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ ఎంట్రీపై మహేశ్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ నుంచి తనకు ఎన్నో ఆఫర్స్‌ వస్తున్నాయని.. కాకపోతే తన దృష్టి అంతా టాలీవుడ్‌పైనే ఉందని అన్నారు.

‘‘దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ మెచ్చుకునే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగాలని ఎప్పటి నుంచో కలలు కన్నాను. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా పలు చిత్రాలతో ఆ కల సాకారమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా. బాలీవుడ్‌లో నాకెన్నో ఆఫర్స్‌ వచ్చాయి. కానీ, వాళ్లు నన్ను భరించలేరనుకుంటున్నా. అందుకే అక్కడికి వెళ్లి నా సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. టాలీవుడ్‌లో నాకు లభిస్తోన్న ప్రేమాభిమానాలు అమితమైనవి. వాటిని వదిలి వేరే పరిశ్రమకు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇక్కడే సినిమాలు చేయాలని, అవి దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరిస్తే చూడాలనుకున్నా. అది నిజమైనందుకు సంతోషిస్తున్నా. ఎందుకంటే తెలుగు సినిమాలే నా బలం’’ అని మహేశ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు