Mahesh Babu: అందుకే మూడేళ్లు విరామం తీసుకున్నా: మహేశ్‌బాబు

కెరీర్‌పరంగా తనని తాను సరిదిద్దుకునేందుకు మూడేళ్లు విరామం తీసుకున్నానని, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తెలిపారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 03 Feb 2022 16:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరీర్‌పరంగా తనని తాను సరిదిద్దుకునేందుకు మూడేళ్లు విరామం తీసుకున్నానని, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తెలిపారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఫిబ్రవరి 4న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న ఎపిపోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమో విశేషంగా అలరిస్తోంది. ‘‘ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ!’’ అని బాలకృష్ణ అడగ్గా మహేశ్‌ నవ్వులు చిందించారు. తన సినిమాల్లోని ఏదైనా డైలాగ్‌ను వినిపించాలని బాలకృష్ణ మహేశ్‌ను కోరగా ‘‘మీ డైలాగ్‌ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు సర్‌’’ అని సమాధానమిచ్చారు. అనంతరం.. ఒకానొక సందర్భంలో మూడేళ్లు గ్యాప్‌ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. ప్రస్తుతం.. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న మహేశ్‌ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాని ఖరారు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని