Major: నాకంత స్వార్థం లేదు.. అందుకే నాన్న బయోపిక్ చేయను: మహేశ్బాబు
ప్రముఖ నటుడు మహేశ్బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించాడు.
హైదరాబాద్: ప్రముఖ నటుడు మహేశ్బాబు నిర్మాతగా మారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మేజర్’. ముంబయి ఉగ్రదాడుల్లో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కగా.. యువ నటుడు అడివి శేష్ హీరోగా నటించాడు. శోభిత, సయీ మంజ్రేకర్, ప్రకాశ్రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం ‘ట్రైలర్ లాంచ్’ ఈవెంట్ను నిర్వహించారు. మహేశ్ అతిథిగా హాజరై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వేడుకనుద్దేశించి మహేశ్ మాట్లాడుతూ.. ‘‘నిన్ననే నేను ‘మేజర్’ సినిమా చూశా. కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. సినిమాలోని ఆఖరి 30 నిమిషాల ఎపిసోడ్కు నా గొంతు ఎండిపోయింది. అంత భావోద్వేగంగా ఉందా ట్రాక్. కాసేపటి వరకు ఏం మాట్లాడలేకపోయా. బయోపిక్ తెరకెక్కించడమనేది బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు చిత్ర బృందానికి నా అభినందనలు. వీరితో భాగమైనందుకు రెండేళ్లుగా నాకు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నారు. ఇంతటి మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు ఇప్పుడు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రిస్క్ చేస్తున్నా అని కొందరు అనుకుంటున్నారు కానీ, నేను అసలు రిస్క్ తీసుకోను. నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్ బ్లస్టరే. ఈ సినిమా కూడా అంతే’’ అని మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుకే మూడు భాషల్లో..
‘‘మనందరిలానే సందీప్ జీవితం కూడా చాలా సాధారణంగా ఉండేది. అలాంటి ఆయన.. అసాధారణ వ్యక్తిగా ఎలా మారారన్నది ‘మేజర్’లో చూపించాం. సందీప్ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోవాలన్నదే ఆయన పేరేంట్స్ కోరిక. అది ఈ చిత్రంతో నెరవేరుతుంది. మార్కెట్ కోసం ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నామని చాలామంది ఊహించుకున్నారు. కానీ, మేం అందుకు చేయలేదు. సందీప్ ఈ దేశ ముద్దుబిడ్డ. తన మాతృభాష మలయాళం కాబట్టి అందులో డబ్ చేశాం, మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగులో తెరకెక్కించాం, ఎక్కువమందికి చేరాలన్న సంకల్పంతో హిందీలోనూ విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు మహేశ్ వెన్నెముకలా నిలిచారు. గుండెను హత్తకునే సంభాషణలు అందించిన అబ్బూరి రవికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని శేష్ పేర్కొన్నారు.
శేష్ గురించి ఓ పుస్తకం రాయొచ్చు
‘‘శేష్ 2018లో మేజర్ జీవితాధారంగా ఓ సినిమా చేయాలనుందన్నాడు. ఇలాంటి గొప్ప కథను ఎలా అయినా తెరకెక్కించాలని అప్పుడే ఫిక్స్ అయ్యా. మహేశ్, నమ్రత మా వెన్నంటే ఉండటం మాకు ధైర్యానిచ్చింది. శేష్తో ఇది నాకు రెండో సినిమా. తన గురించి ఓ పుస్తకం రాయొచ్చు. అనుకున్నది సాధించాలంటే ఎలా శ్రమించాలో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు. శేష్తోపాటు కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్రాజ్, రేవతి నటన అందరినీ కట్టిపడేస్తుంది’’ అని దర్శకుడు శశి తెలిపారు. అనంతరం, మహేశ్- శేష్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
* నటుడిగా మీరు పాన్ ఇండియా సినిమా ప్రయత్నం చేయలేదు. నిర్మాతగా వ్యవహరించడం ఎలా ఉంది?
మహేశ్: అన్నింటికీ కథే సమాధానం. ఈ సినిమాకు నేను నిర్మాతనైనా ఎప్పుడో ఒకసారి సెట్స్కు వెళ్లేవాడిని. నమ్రతనే ఈ ప్రాజెక్టులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది. సహ నిర్మాతలు అనురాగ్, శరత్ హీరోగా శేష్ను అనుకుంటున్నామని చెప్పగానే ఆనందించా. తను నటించిన ‘గూఢచారి’ చిత్రం నాకు బాగా ఇష్టం.
* సినిమా చూశాక, ఇందులో మీరు నటించి ఉంటే బాగుండనిపించిందా?
మహేశ్: లేదండీ. కొన్ని కథలు కొందరికే సెట్ అవుతాయి. వాటికి తగిన న్యాయం చేసేవారి దగ్గరకే అవి వెళ్తాయి. ఇలాంటి వాటిని చూసి ఆనందిస్తా తప్ప మనం చేస్తే బాగుండని ఆలోచించేంత సెల్ఫిష్ కాదు నేను. నా సినిమాలు నేనే చేయాలి, మిగిలిన వాటిని చూసి ఎంజాయ్ అని అనుకుంటా అంతే.
* సల్మాన్ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్తో హిందీ, మలయాళ ట్రైలర్లు విడుదల చేయించడం గురించి..
మహేశ్: ఇది అడివి శేష్ ఆలోచన. ఆయా ఇండస్ట్రీల సూపర్స్టార్లతో విడుదల చేయిస్తే మంచి సినిమా ఎక్కువ మందికి చేరుతుందనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశాం.
* ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్లు వచ్చాయి కదా!
మహేశ్: ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో ఆఫర్లు ఇచ్చాయి. కానీ, మాలో ఎవరికీ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలనే ఆసక్తి లేదు. కొవిడ్/లాక్డౌన్ కారణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సోనీ పిక్చర్స్ సంస్థ మాకు అండగా నిలిచింది.
* కృష్ణ బయోపిక్ వచ్చే అవకాశాలున్నాయా?
మహేశ్: ఇంతకుముందుకు చెప్పినట్టు.. నాన్నగారి బయోపిక్ ఎవరైనా తీస్తే చాలా ఆనందంగా చూస్తా (నవ్వుతూ..). నేనైతే చేయలేను. ఎందుకంటే ఆయన నా దేవుడు.
* సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ తీసేందుకు ఆయన తల్లిదండ్రులను ఎలా ఒప్పించారు?
శేష్: సందీప్ ఏం చేశారో చాలామందికి తెలుసు. కానీ, ఆయన ఎలా బతికారో తెలియదు. దాన్నే చూపించాలనుకున్నా. ఆయన గురించి రీసెర్చ్ చేసే క్రమంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఈ సినిమా చూస్తే అందరిలోనూ పాజిటివిటీ వస్తుంది. సందీప్ జీవితాన్ని సినిమాగా మలిచేందుకు ఎంతోమంది ప్రయత్నించారు. కానీ, సాధ్యపడలేదు. ఏడెనిమిది సార్లు వారి తల్లిదండ్రులతో చర్చించి, సినిమా తీసేందుకు అంగీకారం తీసుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. -
సూర్య సినిమా ఆగిపోలేదు.. వెట్రిమారన్ ఏమన్నారంటే..
నటుడు సూర్య, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. -
అప్డేట్స్ ఇచ్చిన అగ్ర హీరోలు.. రిలీజ్ డేట్తో విజయ్.. టైటిల్స్తో సల్మాన్, గోపీచంద్
అగ్ర హీరోలు పలువురు తమ కొత్త సినిమాల అప్డేట్స్ను అభిమానులతో పంచుకున్నారు. అవేంటో చూసేయండి -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిలిపివేత.. పీవీఆర్ మల్టీప్లెక్స్పై ‘మైత్రీ మూవీస్’ ఆగ్రహం
పీవీఆర్ మల్టీప్లెక్స్ తీరుపై మైత్రీ మూవీస్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే? -
‘గౌడ్ సాబ్’ కథ విని ఆశ్చర్యపోయా: సుకుమార్
కొరియోగ్రాఫర్ గణేశ్ మాస్టర్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. -
పండగ వేళ కొత్త పోస్టర్ల కళకళ.. మరో మూవీ ప్రకటించిన మాస్ హీరో
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. -
‘దేవర’ ఆలస్యమైనా ప్రతి అభిమాని కాలరెగరేసుకునేలా ఉంటుంది: ఎన్టీఆర్
‘దేవర’ (Devara) ఆలస్యమైనా అభిమానులందరూ కాలరెగరేసుకునేలా మూవీని అందించడానికి ప్రయత్నిస్తున్నామని అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ (NTR) అన్నారు. -
‘డియర్’.. ‘గుడ్నైట్’ ఫిమేల్ వెర్షన్ కాదు: ఐశ్వర్యరాజేశ్
ఐశ్వర్య రాజేశ్, జీవీ ప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్’. ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. -
ప్రభాస్తో హను రాఘవపూడి సినిమా లాక్.. ఏ జానరంటే!
తన తర్వాత సినిమా ప్రభాస్తో తీయనున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) స్పష్టం చేశారు. -
ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేద్దామంటే వద్దని చెప్పా: సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘స్పిరిట్’ (Spirit). -
పుష్పగాడి రూల్ మొదలైంది.. ‘పుష్ప 2’ టీజర్ వచ్చేసింది..!
అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకుడు. -
ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో క్రేజీ మూవీస్
బాక్సాఫీస్ వద్ద వేసవి వినోదాల జోరు కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలన్నీ వరుసగా విడుదలవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. -
ఇది కదా.. ‘పుష్ప’ రేంజ్.. రూల్ చేయడానికి వచ్చేస్తున్నాడు!
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేసే టైమ్ను తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ను పంచుకుంది. -
‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్డేట్ ఇచ్చింది. -
బాక్సాఫీస్ వద్ద రూ.కోట్లు కొల్లగొడుతోన్న ‘ఆడు జీవితం’.. వసూళ్లు ఎంతంటే..?
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
హీరో అంటే హీరో పనే చేయాలి.. సినిమాను సినిమాటిక్గానే తీయాలి: దిల్ రాజు
Family Star: ఫ్యామిలీస్టార్ కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు.