Mahesh Babu: ఫ్యాన్స్‌ను నిరాశపరచకూడదని.. మహేశ్‌బాబు ప్లాన్‌ అదేనా?

‘సర్కారువారి పాట’ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేశ్‌ భావిస్తున్నారట

Published : 08 Sep 2021 19:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో దూకుడు మీదున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అదే వేగంతో తన తర్వాతి చిత్రం ‘సర్కారువారి పాట’ను పూర్తి చేద్దామనుకున్నా, ఆ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌లు వేసింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. దర్శకుడు పరుశురామ్‌ వర్కింగ్‌ స్టైల్‌ కూడా అదే కావడంతో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందట.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత గ్యాప్‌ వచ్చినట్లు ఈ సారి రాకుండా చూసుకుందామని మహేశ్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేసి, ఇక విరామం తీసుకోకుండా వెంటనే త్రివిక్రమ్‌ క్యాంప్‌లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. అన్నీ కుదిరితే నవంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్‌ షురూ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మహేశ్‌-త్రివిక్రమ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేను ఇప్పటికే ఎంపిక చేశారు. మరోవైపు ‘సర్కారు వారిపాట’లో కథానాయికగా కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు